15
May, 2025

A News 365Times Venture

15
Thursday
May, 2025

A News 365Times Venture

KCR : తెలంగాణ ప్రజల హితమే బీఆర్ఎస్‌కు ధ్యేయం

Date:

KCR : తెలంగాణ కోసం దశాబ్దాల ఉద్యమానికి నాంది పలికిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల సంక్షేమం పట్ల ఉన్న ఆవేదన, కర్తవ్యనిష్ఠ ఇతర పార్టీలకు దూరమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఉద్యమ స్థాయిలో ప్రజల కోసం అహర్నిశలు కృషి చేయగల శక్తి బీఆర్ఎస్‌దే అని స్పష్టం చేస్తూ, “తెలంగాణ సాధన అనంతరం తొమ్మిదిన్నరేళ్ళ పాటు ప్రజాకాంక్షలకు అనుగుణంగా పాలించగలిగింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే” అని ఆయన అభిప్రాయపడ్డారు.

శనివారం ఎర్రవెల్లి నివాసంలో వరంగల్ రజతోత్సవ సభ (ఈనెల 27న)కు సంబంధించి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో నెలకొన్న బీభత్స పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలే కేంద్రంగా, వారి అభ్యున్నతే ధ్యేయంగా పాలించగల పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. కానీ గత ఏడాదిన్నరలో కాంగ్రెస్ పాలన ప్రజలకు ఏం కోల్పోయామో స్పష్టంగా చూపింది” అని అన్నారు.

తెలంగాణ ఏర్పాటై కొంత కాలంలో విద్యుత్ రంగం పూర్తిగా కల్లోలానికి లోనైందని, నేషనల్ గ్రిడ్‌కే అనుసంధానం లేని పరిస్థితుల్లో 9 నెలల్లోనే రాష్ట్రాన్ని విద్యుత్ స్వయం సమృద్ధిగా మార్చగలిగిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆయన గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకునే అవకాశం లేకుండా ఉన్నప్పుడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు నేడు ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రత్యేక జిల్లాల నాయకులు తమ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వ్యవసాయ కష్టాలు, సాగునీటి లోపం, విద్యుత్ సరఫరాలో అంతరాలు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై వివరాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోందని వారు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో, కేసీఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్సు నాయకులకు ప్రజల సమస్యలు కాదు, వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అలాంటి నాయకత్వం తెలంగాణ ప్రజలకు శాపం” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರಾಜ್ಯ ಸಚಿವ ಸಂಪುಟ ಪುನಾರಚನೆ ಕುರಿತು ಸುಳಿವು ನೀಡಿದ ಶಾಸಕ ತನ್ವಿರ್ ಸೇಠ್

ಮೈಸೂರು,ಮೇ,14,2025 (www.justkannada.in): ರಾಜ್ಯಸಚಿವ ಸಂಪುಟ ಪುನರಚನೆ ಕುರಿತು ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕ...

ദേശീയ സുരക്ഷ; തുര്‍ക്കി സര്‍വകലാശാലയുമായുള്ള ധാരണാപത്രം റദ്ദാക്കി ജെ.എന്‍.യു

ന്യൂദല്‍ഹി: ദേശീയ സുരക്ഷ മുന്‍നിര്‍ത്തി തുര്‍ക്കി സര്‍വകലാശാലയുമായുള്ള ധാരണാപത്രം നിര്‍ത്തിവെച്ച് ജെ.എന്‍.യു....

Mahanadu: కడపలో మహానాడు.. పార్టీలో కీలక సంస్కరణలు

Mahanadu: టీడీపీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న...