12
May, 2026

A News 365Times Venture

12
Tuesday
May, 2026

A News 365Times Venture

Harish Rao : తెలంగాణ నీటి ప్రయోజనాలకు గండి

Date:

Harish Rao : తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏకపక్షంగా తరలించుకుంటూ తెలంగాణకు నష్టం కలిగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్చలంగా చూస్తుండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హరీష్ రావు పేర్కొన్నట్టుగా, గత మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు 10వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోంది. ఏడాది మొత్తంగా ఇది 646 టీఎంసీలకు చేరుకుంటుంది. అయినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తాగునీటి అవసరాలకు, సాగర్ జలాశయంలో నిల్వ ఉంచాల్సిన నీటిని ఏపీ బలవంతంగా తరలించుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చైతన్యం లేదని హరీష్ రావు మండిపడ్డారు.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవర్ స్టార్‌ సీన్ లీక్.. గూస్ బంప్స్ పక్కా!

నాగార్జున సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పటికీ, ఏపీ ఇష్టానుసారంగా నీటిని తరలించుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగిలిన నీటి నిల్వలు తగ్గిపోతున్నా, పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ మరింత నీటిని తరలించేందుకు మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి సంవత్సరం ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగంపై కేఆర్ఎంబీ పరిధిలో త్రిమెన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ మీటింగ్ జరగకపోవడం, కేంద్ర బోర్డు పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని హరీష్ రావు పేర్కొన్నారు.

CM Chandrababu: రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోకి హాజరు

ఏపీ దూకుడుకు, తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తెగబడ్డ ప్రభావం ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ కావడమేనని హరీష్ రావు ఆరోపించారు. వేసవి తాకిడి ప్రారంభమవకముందే తెలంగాణ రైతులు నీటి కోసం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఏపీ సాగర్ ఆయకట్టుకు ముప్పుగా మారేలా నీటిని తరలిస్తుండటం సరికాదని, వెంటనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఈ దోపిడిని అడ్డుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సాగర్ లో నీటి మట్టం పడిపోతే, హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి, తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని హరీష్ రావు తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ലേലമെന്ന പോലെ ചോദ്യപേപ്പർ വിൽപന; 2026 നീറ്റ് ചോദ്യപേപ്പർ ചോർച്ചയിൽ ഗുരുതര ആരോപണവുമായി രാഹുൽ ഗാന്ധി

ന്യൂദൽഹി: 2026ലെ നീറ്റ് പരീക്ഷയുടെ ചോദ്യപേപ്പർ ചോർന്നുവെന്ന ഗുരുതരമായ ആരോപണവുമായി ലോക്‌സഭ...

TVK: ஸ்டாலின் முதல் சீமான் வரை – அரசியல் தலைவர்களை நேரில் சந்தித்த முதல்வர் விஜய் |Photo Album

ஸ்டாலின் - விஜய் சந்திப்பு: ஆரத்தழுவி வரவேற்ற உதயநிதி, கைபிடித்து அழைத்துச்...

PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాల ముఖ చిత్రాన్ని మార్చేశాయి. యుద్ధం కారణంగా...

ಸಚಿವ ಡಿ.ಸುಧಾಕರ್ ಪಂಚಭೂತಗಳಲ್ಲಿ ಲೀನ: ಅಂತ್ಯಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಸಿಎಂ,ಡಿಸಿಎಂ ಭಾಗಿ

ಚಿತ್ರದುರ್ಗ,ಮೇ,11,2026 (www.justkannada.in):  ಅನಾರೋಗ್ಯದಿಂದ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿ ಚಿಕಿತ್ಸೆ ಫಲಿಸದೇ ನಿಧನರಾದ ...