14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

AP Govt : గ్రామ, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసే ఛాన్స్..!

Date:

AP Govt : త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు (ఫిబ్రవరి 17) గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి ఆయా ఉద్యోగ సంఘాల నుంచి వ‌చ్చే విన‌తులు, సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని తుది నివేదికను అధికారులు ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖల్లో గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులను తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇతర శాఖల్లోకి వెళ్లే ఆలోచన ఎవరికి ఉంది.. అనే అంశంపై ఆన్ లైన్ లో ఓటింగ్ నిర్వహిస్తున్నాయి కొన్ని సంఘాలు.

Read Also: Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..

అయితే, ఇప్పటికే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌ ఉద్యోగులను జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌ మూడు కేట‌గిరీలుగా ప్రభుత్వం విభ‌జించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి అనుగుణంగా రేష‌న‌లైజేష‌న్ చేప‌ట్టేందుకు చర్యలకు తీసుకుంటుంది. ఇక, 2,500 మంది జ‌నాభా ఉన్న స‌చివాల‌యానికి ఏ కేటగిరీ కింద ఆరుగురు, 3,500 వ‌ర‌కు జ‌నాభా ఉన్న స‌చివాల‌యానికి బీ కేటగిరీకి ఏడుగురు, 3,500 లకు మించి ఎక్కువ‌గా జ‌నాభా ఉన్న స‌చివాల‌యాన్ని సీ కేటగిరీ కింద ఎనిమిది మందిని కేటాయించారు. ఇలా, ఉద్యోగుల‌ను విభ‌జించ‌డంతో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు మిగిలిపోయారు.. వారినీ ఇత‌ర శాఖ‌ల్లో వివిధ అవ‌స‌రాల‌కు వినియోగించుకోనుంది ఏపీ ప్రభుత్వం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೃಷ್ಣ ಮೇಲ್ದಂಡೆ ಯೋಜನೆ: ಸರ್ವಪಕ್ಷ ಸಭೆ ಕರೆದಿದ್ದೇವೆ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬಾಗಲಕೋಟೆ,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in) : ಕೃಷ್ಣ ಮೇಲ್ದಂಡೆ ಯೋಜನೆ ಸಂಬಂಧ ನವದೆಹಲಿಯಲ್ಲಿ...

കരുതലിന്റെ കാതല്‍; വയനാട് ടൗണ്‍ഷിപ്പിലെ താമസക്കാര്‍ക്ക് സാധന സാമഗ്രികള്‍ വാങ്ങാന്‍ ഒരു ലക്ഷം വീതം

തിരുവനന്തപുരം: ഒരുക്കിയ വയനാട് ടൗണ്‍ഷിപ്പിലെ താമസക്കാര്‍ക്ക് കൂടുതല്‍ ധനസഹായവുമായി സംസ്ഥാന സര്‍ക്കാര്‍....

"தேர்தலில் போட்டியிடும்படி மோடியின் பிரதிநிதி என்னை சந்தித்தார்" – எம்.பி ஆக ஆசைப்படும் ஐ.எம்.விஜயன்

கேரளாவில் விரைவில் சட்டசபை தேர்தல் நடைபெற உள்ளது. கேரளாவைச் சேர்ந்த இந்தியக்...

War Effect : తెలంగాణలో వార్ ఎఫెక్ట్.. చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర చరిత్రలో...