19
May, 2026

A News 365Times Venture

19
Tuesday
May, 2026

A News 365Times Venture

Viral: ఇండియా-పాక్ మధ్య కొన్ని రోజుల్లో మ్యాచ్.. గొడవ పడ్డ హర్భజన్, అక్తర్.. (వీడియో)

Date:

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాగా.. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఏ టీమ్స్ ఫైనల్‌కు వెళ్తాయో అంచనా వేస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 23న భారత్-పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ టోర్నీకి ముందు క్రికెట్ దిగ్గజాలు గొడవ పడటం కలకలం రేపుతోంది. ILT20 2025 ఫైనల్‌లో టీమిండియా మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్, పాక్ మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్‌ గొడవ పడ్డ వీడియో వైరల్ అవుతుంది.

Read Also: Student Kidnapped: కాకినాడలో బాలుడి కిడ్నాప్.. గాలిస్తున్న పోలీసులు!

అయితే ఈ గొడవ సీరియస్‌గా జరిగింది కాదు.. ఫన్నీగా జరిగింది. స్టేడియంలో ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు సరదాగా గొడవ పడుతుండటం ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. వైరల్ అవుతున్న వీడియోలో హర్భజన్ బ్యాట్‌తో, షోయబ్ బంతితో ఒకరినొకరు సరదాగా నెట్టుకుంటూ, సవాలు చేసుకుంటున్నారు. కాగా.. ఈ వీడియోను అక్తర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశాడు. ‘ఛాంపియ‌న్స్ ట్రోఫీకి మేమిలా సిద్ధమ‌వుతున్నాం’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్ ఫిబ్రవ‌రి 23న దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನೀಟ್ ಅಕ್ರಮ: ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಮಾತನಾಡಬೇಕು- ಡಿ.ಕೆ ಸುರೇಶ್ ಆಗ್ರಹ

ಬೆಂಗಳೂರು,ಮೇ,18,2026 (www.justkannada.in):   ಪ್ರಶ್ನೆ ಪತ್ರಿಕೆ ಸೋರಿಕೆ, ನೀಟ್ ಪರೀಕ್ಷೆ ರದ್ದಾದ...

സത്യപ്രതിജ്ഞാ വേദിയിലെ വന്ദേമാതരം; യു.ഡി.എഫിനെ പ്രശംസിച്ച് ആർ.എസ്.എസ് മുഖമാസിക

തിരുവനന്തപുരം: കേരളാ മുഖ്യമന്ത്രിയും മന്ത്രിമാരും സത്യപ്രതിജ്ഞ ചെയ്ത വേദിയിൽ വന്ദേമാതരം ആലപിച്ചതിന്...

கேரளம்: `மகளிர் இலவச பஸ் பயணம், முதியோருக்கு சிறப்பு துறை'- புதிய முதல்வர் வி.டி.சதீசன் அறிவிப்பு!

கேரளத்தின் 13-வது முதல்வராக வி.டி.சதீசன் இன்று பதவி ஏற்றார். திருவனந்தபுரம் செண்ட்ரல் ...