18
August, 2026

A News 365Times Venture

18
Tuesday
August, 2026

A News 365Times Venture

Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..

Date:

Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) విషయంలో భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. పాకిస్థాన్ నుంచి ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో, 1960లో కుదిరిన 65 ఏళ్ల నాటి ఒప్పందాన్ని ప్రస్తుత రూపంలో తిరిగి అమలు చేసే అవకాశం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం వెల్లడించింది. భవిష్యత్తులో ఏ కొత్త ఒప్పందమైనా పాకిస్థాన్ ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి పలికిన తర్వాతే సాధ్యమవుతుందని భారత్ తేల్చిచెప్పింది.

భారత ప్రభుత్వ వర్గాల ప్రకారం.. సింధు జలాల పంపిణీకి సంబంధించిన నిబంధనలను యథాతథంగా కొనసాగించడం సాధ్యం కాదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందంలో మార్పులు అవసరమని అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు కొనసాగుతున్న నేపథ్యంలో పాత విధానాన్ని కొనసాగించలేమని భారత్ పేర్కొంది. అయితే భారత్ ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగాలని ప్రస్తుతం కోరుకోవడం లేదని, కానీ ఒక సార్వభౌమ దేశంగా తన జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఒప్పందాన్నైనా పునఃసమీక్షించే హక్కు ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

పాకిస్థాన్ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన భారత్

భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్థాన్‌లో నీటి కొరత ఏర్పడుతోందని ఇస్లామాబాద్ చేస్తున్న ప్రచారాన్ని భారత వర్గాలు ఖండించాయి. పాకిస్థాన్‌లో నిల్వ సదుపాయాల కొరత, కాలువల్లో లీకేజీలు, అంతర్గత రాష్ట్రాల మధ్య నీటి వివాదాల కారణంగానే పెద్దఎత్తున నీరు వృథా అవుతోందని భారత్ పేర్కొంది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కీలక నిర్ణయం

గత ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడికి లష్కర్-ఎ-తయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది. ఈ ఘటన అనంతరం భారత్ పలు దౌత్య, ఆర్థిక చర్యలు చేపట్టింది. వాటిలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం కూడా ఒకటి. అనంతరం మే నెలలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించింది.

1960లో కుదిరిన చారిత్రక ఒప్పందం

ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో తొమ్మిదేళ్లపాటు జరిగిన చర్చల అనంతరం 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్థాన్‌ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ వంటి తూర్పు నదులపై భారత్‌కు హక్కులు లభించగా, సింధు, జీలం, చెనాబ్ వంటి పశ్చిమ నదులపై పాకిస్థాన్‌కు ప్రధాన హక్కులు కల్పించారు. అయితే పశ్చిమ నదుల ఉపనదులపై ‘రన్ ఆఫ్ ది రివర్’ విధానంలో జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకునే హక్కు భారత్‌కు ఉంది.

భారత ప్రాజెక్టులపై పాకిస్థాన్ అభ్యంతరాలు

సలాల్, బగ్లిహార్, కిషన్‌గంగా, రాట్లే, పకల్ దుల్ వంటి దాదాపు ప్రతి జలవిద్యుత్ ప్రాజెక్టుపై పాకిస్థాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చిందని భారత వర్గాలు చెబుతున్నాయి. వివాద పరిష్కారానికి ఒప్పందంలో ఉన్న వ్యవస్థను పాటించకుండా, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వేదికలను ఆశ్రయించడం ద్వారా పాకిస్థాన్ తరచూ అడ్డంకులు సృష్టించిందని భారత్ ఆరోపిస్తోంది. 2015లో కిషన్‌గంగా, రాట్లే ప్రాజెక్టులపై తటస్థ నిపుణుడిని నియమించాలని కోరిన పాకిస్థాన్, 2016లో తన వైఖరిని మార్చుకుని మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రపంచ బ్యాంకు రెండు ప్రక్రియలను ప్రారంభించినప్పటికీ, భారత్ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని అంగీకరించకుండా తటస్థ నిపుణుడి ప్రక్రియకే మద్దతు తెలిపింది.

ఉగ్రవాదంపై స్పష్టమైన షరతు

పాకిస్థాన్‌లో ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులు ఇప్పటికీ బహిరంగంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భారత్ పేర్కొంది. నియంత్రణ రేఖ (LoC) వెంట కూడా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు పాకిస్థాన్ విశ్వసనీయ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం భవిష్యత్తు పూర్తిగా పాకిస్థాన్ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి పలికి, సహకార వైఖరిని అవలంబిస్తేనే కొత్త రూపంలో ఒప్పందం పునరుద్ధరణపై చర్చలు సాధ్యమవుతాయని భారత ప్రభుత్వం తేల్చిచెప్పింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പ്രതിഷേധിച്ച വിദ്യാർത്ഥികൾക്കെതിരായ എഫ്.ഐ.ആർ പിൻവലിക്കുന്നതിൽ കേന്ദ്രം കാലതാമസം വരുത്തുന്നു; നഷ്ടപരിഹാരം നൽകുമെന്ന ഉറപ്പും പാലിച്ചില്ല: സി.ജെ.പി

ന്യൂദൽഹി: ധർമേന്ദ്ര പ്രധാന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് പ്രതിഷേധിച്ചവർക്കെതിരായ എഫ്‌.ഐ.ആറുകൾ പിൻവലിക്കുന്നതിൽ കേന്ദ്രസർക്കാർ...

தலைமைச் செயலகத்தில் முதல்வருடன் சந்திப்பு; `இது குறித்தெல்லாம்தான் பேசினேன்' – திருமா சொல்வதென்ன?

நேற்று கள்ளக்குறிச்சி உளுந்தூர்பேட்டையில் விடுதலைச் சிறுத்தைகள் கட்சி, ‘தமிழ்த் தேசிய எழுச்சி...

Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..

హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి మాఫియాపై హైదరాబాద్...

KPSC ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಶಿವಶಂಕರಪ್ಪ ಸಾಹುಕಾರ್ ಮರುನೇಮಕಕ್ಕೆ ಹೈಕೋರ್ಟ್ ಆದೇಶ

ಬೆಂಗಳೂರು, ಆಗಸ್ಟ್,​​ 18,2026 (www.justkannada.in): ಪಶುವೈದ್ಯಾಧಿಕಾರಿಗಳ ನೇಮಕಾತಿಯಲ್ಲಿ ಅಕ್ರಮ ಆರೋಪಕ್ಕೆ...