16
July, 2026

A News 365Times Venture

16
Thursday
July, 2026

A News 365Times Venture

Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!

Date:

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరస్పరం ఫోన్‌లో మాట్లాడుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నాలుగు సార్లు శాసనసభ్యుడిగా (ఎమ్మెల్యే), ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఈరోజు ఉదయం ఫోన్‌లో చర్చించారు. ముద్రగడ ప్రజా సేవలను స్మరించుకుంటూ ప్రభుత్వ గౌరవాలతో అంతిమ వీడ్కోలు పలకాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముద్రగడకు అధికారిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.എസ് സൈനികരുടെ മൊബൈല്‍ ഫോണ്‍ വിവരങ്ങള്‍ ഇറാന്‍ ചോര്‍ത്തിയതായി വെളിപ്പെടുത്തല്‍

ന്യൂയോര്‍ക്ക്: യു.എസ് സൈനികോദ്യോഗസ്ഥരെ ലക്ഷ്യമിട്ട് ഇറാന്റെ സൈബര്‍ ആക്രമണം നടന്നതായി ഗവേഷണ...

ಇನ್ಮುಂದೆ 15 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಸ್ಥಳಕ್ಕೆ 108 ಆ್ಯಂಬುಲೆನ್ಸ್: ಹೊಸ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಮುಂದಾದ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,15,2026 (www.justkannada.in):  ದೇಶದಲ್ಲೇ ರಾಜ್ಯದ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ ಹೊಸ ಪ್ರಯತ್ನಕ್ಕೆ...

ദലിത് ഡോക്ടറെ അംഗീകരിക്കില്ല, ഗവേഷകനെ ‘ശര്‍മ’യാക്കും: എ.ഐയിലെ ജാതിയെക്കുറിച്ച് പഠനവുമായി സി.എസ്.ഒ.എച്ച്.

ന്യൂയോര്‍ക്ക്: ഇന്ത്യയിലെ ജാതി വ്യവസ്ഥയെ പുനരുല്‍പാദിപ്പിക്കുന്ന തരത്തിലാണ് ഐ.ഐ മോഡലുകളുടെ പ്രവര്‍ത്തനമെന്ന...