19
June, 2026

A News 365Times Venture

19
Friday
June, 2026

A News 365Times Venture

IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్‌గా యువరాజ్ సింగ్..

Date:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్‌లో తన మొదటి కోచింగ్ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక సిబ్బందిలో యువరాజ్ సింగ్ చేరనున్నారని, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా మళ్లీ జట్టులోకి రాబోతున్నారని సమాచారం. ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ చేజిక్కించుకోనుండటంతో ఈ మార్పులు ఊపందుకున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని జీఎమ్ఆర్ (GMR) గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చెరి రెండు సంవత్సరాల చొప్పున ప్రత్యామ్నాయంగా నడుపుతాయి. 2025, 2026 సీజన్లలో జీఎమ్ఆర్ గ్రూప్ జట్టును నడిపించగా, వచ్చే రెండేళ్ల పాటు (2027, 2028) జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ బాధ్యతలను స్వీకరించనుంది. గతంలో జేఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో గంగూలీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కీలక పాత్ర పోషించారు. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 (SA20) లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించి, ఆ జట్టును ఫైనల్‌కు చేర్చిన అనుభవం కూడా గంగూలీకి ఉంది. అందుకే ఆయన తిరిగి ఢిల్లీ జట్టులోకి వస్తూ, యువరాజ్ సింగ్‌ను కూడా తనతో పాటు డగౌట్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

గత రెండు సీజన్లలో (IPL 2025, 2026) ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. అక్షర్ పటేల్ సారథ్యంలో.. కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. 2025లో టోర్నీని అద్భుతంగా ఆరంభించినా, రెండో భాగంలో తడబడి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక 2026లో మరింత నిలకడలేని ప్రదర్శనతో ఆరో స్థానానికి పడిపోయింది. ఈ పేలవ ఫలితాల వల్ల ప్రస్తుత ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ పదవి ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో, 2027లో గంగూలీ మళ్లీ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం కాగా, యువరాజ్ సింగ్ రాకతో జట్టుకు సరికొత్త ఊపు వస్తుందని యాజమాన్యం ఆశిస్తోంది. సీనియర్ అధికారులు కూడా యువరాజ్ చేరికను ధృవీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സി.പി.ഐ.എമ്മും ലീഗും കോണ്‍ഗ്രസും പിന്തുണയ്ക്കുന്ന സര്‍ക്കാര്‍; പക്ഷേ തമിഴ്നാട്ടില്‍ ഇസ്രാഈല്‍ റഡാറുകള്‍ നിര്‍മിക്കാനൊരുങ്ങുന്നു

ചെന്നൈ: തമിഴ്നാട്ടിലെ കൃഷ്ണഗിരി ജില്ലയില്‍ ഇസ്രഈല്‍ സര്‍ക്കാര്‍ ഉടമസ്ഥതയിലുള്ള ഇസ്രഈല്‍ എയ്റോസ്പേസ്...

7 எம்.எல்.ஏக்களுக்கு 5 பேருந்துகள்! – MLA ஸ்பெஷல் பஸ் நடைமுறை தேவையா?

சட்டமன்றக் கூட்டத்தொடர்கள் நடக்கும் போது சட்டமன்ற உறுப்பினர்களுக்கென சிறப்பு பேருந்துகள் இயக்கப்படும்....

JK EXCCLUSIVE: 10 ವರ್ಷಗಳ ಗುತ್ತಿಗೆ ಅವಧಿ ಪೂರ್ಣಗೊಂಡ ನಿವೇಶನಗಳಿಗೆ ಕ್ರಯಪತ್ರ

  ಬೆಂಗಳೂರು/ಮೈಸೂರು: ಮೈಸೂರು ನಗರಾಭಿವೃದ್ಧಿ ಪ್ರಾಧಿಕಾರ (ಮುಡಾ) ವತಿಯಿಂದ 2005ರ ನಂತರ...