15
June, 2026

A News 365Times Venture

15
Monday
June, 2026

A News 365Times Venture

Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్‌.. మూడు నెలల్లో రెండో సారి..

Date:

Aqua Farmers: ఆక్వా రైతులకు మరోసారి ఫీడ్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి.. మూడు నెలల్లో రెండో సారి మేత ధరలు పెంచడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనామీ రకం మేత పై కిలోపై పది రూపాయలు పెంచగా.. టైగర్ ప్రాన్ మేత ధరలు కిలోపై 12 రూపాయల ధర పెరిగింది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రావడంతో పాలకొల్లులో ఆక్వా రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ పై సమాలోచన చేస్తున్నారని. ఇప్పటికే రొయ్య రేటు పతనం కావడం, పెంచిన ధరలతో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రైతులతో చర్చించకుండా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై మరోసారి నిరసనలు తెలిపేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఫీడ్‌ ధరలు పెరగడంతో 25 కేజీల వనామి రొయ్యల మేత బస్తా ధర 2,793, టైగర్ రొయ్య మేత బస్తా ధర 3,088 కు చేరింది.. ఇప్పటికే అమెరికా టారిఫ్‌ ఎఫెక్ట్‌తో నష్టపోయిన రైతులు.. మరోవైపు, ఇరాన్ – ఇజ్రాయల్, అమెరికా మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం కూడా ఆక్వా ఎగుమతులపై పడడంతో ఇబ్బంది పడుతున్నారు రైతులు.. అయితే, వరుసగా మేత ధరలు పెరగడం మరింత భారంగా మారిపోతుంది..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ശബരിമല സ്വര്‍ണക്കൊള്ള: പത്മകുമാറിനെ പ്രാഥമിക അംഗത്വത്തില്‍ നിന്ന് സസ്‌പെന്‍ഡ് ചെയ്ത് സി.പി.ഐ.എം

പത്തനംതിട്ട: ശബരിമല സ്വര്‍ണക്കൊള്ള കേസിലെ പ്രതിയും മുന്‍ എം.എല്‍.എയും സി.പി.ഐ.എം നേതാവുമായ...

“6 முதல் 8-ம் வகுப்பு மாணவர்களுக்கும் காலை உணவு: பெரியார் பிறந்தநாளில் அமல்" – முதல்வர் விஜய்!

தமிழ்நாடு அரசின் தலைமைச் செயலகத்தில் இன்று (15.06.2026) முதல்வர் ஜோசப் விஜய்...

Southwest Monsoon: రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. పిడుగులతో కూడిన వర్షాలకు హెచ్చరిక

Southwest Monsoon: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల...

RSS ಬಗ್ಗೆ ಜನರಲ್ಲಿ ಅನುಮಾನ ಮೂಡಿಸುವ ಕೆಲಸ ಇನ್ಮುಂದೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ- ಮೋಹನ್ ಭಾಗವತ್ ತಿರುಗೇಟು

ತ್ರಿಶೂರ್,ಜೂನ್,15,2026 (www.justkannada.in): ಆರ್ ಎಸ್ಎಸ್ ಬಗ್ಗೆ ಜನರಲ್ಲಿ ಅನುಮಾನ ಮೂಡಿಸುವ...