14
May, 2026

A News 365Times Venture

14
Thursday
May, 2026

A News 365Times Venture

Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!

Date:

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. ప్రధాని మోడీకి కీలక లేఖ రాశారు. దేశంలోని టెక్స్‌టైల్ రంగాన్ని, ముఖ్యంగా లక్షలాది ఉద్యోగాలను కాపాడేందుకు పత్తిపై ప్రస్తుతం అమలులో ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. పత్తి, నూలు ధరలు భారీగా పెరగడంతో టెక్స్‌టైల్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాలకు చెందిన మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ప్రస్తుతం ముడి సరుకు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.

‘‘భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్, దుస్తుల ఎగుమతి రాష్ట్రం తమిళనాడు. ఈ రంగంపై లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఇది ప్రధాన ఉపాధి వనరు. అయితే ఇటీవల పత్తి ఉత్పత్తి తగ్గడం, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు విపరీతంగా పెరిగాయి” అని విజయ్ పేర్కొన్నారు.

గత రెండు నెలల్లోనే పత్తి ధరలు 25 శాతం పెరిగాయని తెలిపారు. ఒక క్యాండీ పత్తి ధర రూ.54,700 నుంచి రూ.67,700కు చేరిందన్నారు. అలాగే నూలు ధర కిలోకు రూ.301 నుంచి రూ.330కు పెరిగిందని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు అందుబాటులో ఉండాలంటే దిగుమతులు తప్పనిసరి అవుతున్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతం పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం ఉండటం పరిశ్రమపై మరింత భారం పెడుతోందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్‌టైల్ పరిశ్రమేనని, ముఖ్యంగా మహిళల ఉపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

“పత్తి దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తే పరిశ్రమకు ముడి సరుకు కొరత తీరుతుంది. అలాగే ఎగుమతులు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో పోటీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. లక్షలాది ఉద్యోగాలు కూడా రక్షించబడతాయి” అని సీఎం విజయ్ లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం అమలులో ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని వెంటనే 0 శాతానికి తగ్గించాలని ప్రధాని జోక్యం చేసుకోవాలని సీఎం విజయ్ విజ్ఞప్తి చేశారు.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വർക്ക് ഫ്രം ഹോം, വിദേശ യാത്ര വേണ്ട; ഇറാൻ യുദ്ധ പശ്ചാത്തലത്തിൽ ചെലവുചുരുക്കൽ നയങ്ങളുമായി ദൽഹി സർക്കാർ

ന്യൂദൽഹി: പശ്ചിമേഷ്യൻ സംഘർഷ സാഹചര്യം കണക്കിലെടുത്ത് നിർണായക നീക്കങ്ങളുമായി ദൽഹി സംസ്ഥാന...

"எடப்பாடி பழனிசாமிக்கு ஜெயலலிதாவின் ஆத்மா தண்டனை கொடுக்கிறது" – அமைச்சர் செங்கோட்டையன்

கோவை விமான நிலையத்தில் அமைச்சர்  செங்கோட்டையன் செய்தியாளர்களுக்குப் பேட்டியளித்தார். அப்போது பேசிய...

ಹಿಜಾಬ್ ಬಗ್ಗೆ ಮಾತನಾಡ್ತೀರಾ? ಜನಿವಾರ ಕಾಣಿಸಲ್ವಾ? ಬಿಜೆಪಿಗೆ  ಸಚಿವ ಮಧು ಬಂಗಾರಪ್ಪ ಟಾಂಗ್

ಬೆಂಗಳೂರು,ಮೇ,14,2026 (www.justkannada.in) :  ಶಾಲಾ-ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ ಹಿಜಾಬ್ ಗೆ ಅವಕಾಶ ನೀಡಿ...

എസ്.ഐ.ആർ മൂന്നാം ഘട്ടം മെയ് 30 മുതൽ; പ്രഖ്യാപനവുമായി തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷൻ

ന്യൂദൽഹി : വോട്ടർപട്ടിക പുനപരിശോധനയുടെ മൂന്നാം ഘട്ടം ഈ മാസം 30...