18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

PM Modi China Tour: ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనాకు భారత ప్రధాని.. ఆగస్టు 31న జిన్‌పింగ్‌తో మోడీ భేటీ

Date:

PM Modi China Tour: ఆగస్టు 31వ తేదీన జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించబోతున్నారు. ఈ టూర్ ఇటీవలి కాలంలో, ముఖ్యంగా తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం, భారత్- చైనా మధ్య సంబంధాలలో ఒక కీలక మలుపుగా చెప్పుకోవాలి. నేటి సాయంత్రం రెండు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్తున్న మోడీ. ఆ తర్వాత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు చైనా నగరమైన టియాంజిన్‌లో పర్యటిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also: Kamal Haasan: ట్రంప్ సుంకాలపై భారత్‌కు కమల్‌హాసన్ కీలక సూచనలు

అయితే, ఏడు సంవత్సరాల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు వెళ్లడం ఇదే మొదటి పర్యటన అవుతుంది. ప్రాంతీయ, ప్రపంచ గతిశీలత అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఈ టూర్ కి ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత్- అమెరికా నుంచి వాణిజ్య ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని మోడీ ఈ పర్యటనకు వెళ్లడం ఉత్కంఠ రేపుతుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని భారత్ పై కక్షగట్టిన ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. దీంతో ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం వివిధ దేశాలతో కొత్త ఒప్పందాలను చేసుకుని.. తన వాణిజ్య సంబంధాలను మరింత మెరుగు పర్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. SCO శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొనడంతో భారతదేశం దౌత్యపరమైన అంశాలతో పాటు ఆర్థిక వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಭೇಟಿಯಾಗಬೇಕಿತ್ತು, ಆದ್ರೆ ಆಗಲಿಲ್ಲ- ಮಾಜಿ ಸಚಿವ ಕೆ.ಎನ್ ರಾಜಣ್ಣ

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in):  ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರನ್ನ ಭೇಟಿಯಾಗಬೇಕಿತ್ತು...

ഇറാന്‍ ഇന്റലിജന്‍സ് മന്ത്രി എസ്മായില്‍ ഖത്തീബിനെ കൊലപ്പെടുത്തിയെന്ന് ഇസ്രഈല്‍

ടെല്‍ അവീവ്: ഇറാന്റെ ഇന്റലിജന്‍സ് മന്ത്രി എസ്മായില്‍ ഖത്തീബിനെ വധിച്ചതായി ഇസ്രഈല്‍...

“ராகுல் காந்தியைப் பார்க்கும்போது அசௌகரியமாக இருக்கிறது" – கங்கனா ரனாவத்

நாடாளுமன்றத்தின் பட்ஜெட் கூட்டத்தொடர் நடந்து வருகிறது. எரிவாயு தட்டுப்பாடு முதல் ஈரான்...

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు

Pinnelli Ramakrishna Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ...