2
May, 2026

A News 365Times Venture

2
Saturday
May, 2026

A News 365Times Venture

CM Revanth Reddy: తెలంగాణలో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాం..

Date:

CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవిగిన కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టింది మీరు.. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం.. ప్రతీ గుండె తడుతూ పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూన్నాళ్ళ ముచ్చటే అన్నారు.. మూడు నెలల తర్వాత.. కలిసి పని చేయలేరు అన్నారు.. ఆ తర్వాత పథకాలు అమలు ఎక్కడ చేస్తారని విమర్శలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ… తెలంగాణ రోల్ మోడల్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా.. వాటిని అధిగమిస్తూ ముందుకు పోతున్నాం.. రైతాంగానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మనది.. గోతి కాడ నక్కలా చూశారు కొందరు.. రైతు భరోసా వేయరు అనుకున్నారు.. కానీ, 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.. రైతు రాజ్యం ఎవరు తెచ్చారని చర్చ పెడదాం.. ఢిల్లీలో మోడీ వస్తాడా.. గల్లీలో కేడీ వస్తాడా చూద్దాం.. నేను మా కార్యకర్తలతో వస్తాను అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read Also: IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్

అయితే, పేదల కోసం ఇందిరమ్మ పేరుతో క్యాంటీన్ పెడితే కొందరు దద్దమ్మలు ధర్నాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బట్టలూడదీసి కొడితే కానీ వాళ్లకు ఇందిరమ్మ గురించి తెలియదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ లకు ఇచ్చే సరుకులు గతంలో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు.. కానీ, మనం అధికారంలోకి వచ్చాకా మహిళా సంఘాలకు సరుకుల పంపిణీ చేసే బాధ్యతను ఇచ్చామని తెలిపారు. ఒక్కో అడుడు వేసుకుంటూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం.. ఈ 18 నెలల్లో.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి రేవంత్ తెలియజేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മാധ്യമസ്വാതന്ത്ര്യ സൂചികയില്‍ വീണ്ടും തിരിച്ചടി; 153ാം സ്ഥാനത്തുള്ള പാകിസ്ഥാനും പിന്നില്‍ ഇന്ത്യ

ന്യൂദല്‍ഹി: ലോക മാധ്യമസ്വാതന്ത്ര്യ സൂചികയില്‍ ഇന്ത്യക്ക് വീണ്ടും തിരിച്ചടി. റിപ്പോര്‍ട്ടേഴ്സ് വിത്തൗട്ട്...

திக் திக்… மூடில் திமுக தலைமை… ''என்னதான் ஆச்சு?!"

“தேர்தல் களம் என்றால் தி.மு.க-வினரை போல சுற்றி சுழன்று பணியாற்றுபவர்கள் இருக்க...

Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?

రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ప్రధాన ఆధారం....

ಖರ್ಗೆ ಅವರೇ ಪಕ್ಷದ ಸುಪ್ರೀಂ: ರಾಜ್ಯದಲ್ಲಿ ಯಾವ ಬದಲಾವಣೆ ಇಲ್ಲ- ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ವಿಜಯಪುರ,ಮೇ1,2026 (www.justkannada.in): ಸದ್ಯಕ್ಕೆ ಸಿಎಂ ಬದಲಾವಣೆ ಇಲ್ಲ ಎಂಬ ಎಐಸಿಸಿ...