26
August, 2026

A News 365Times Venture

26
Wednesday
August, 2026

A News 365Times Venture

Jagdeep Dhankhar: “ఒసామా బిన్ లాడెన్” హత్య లాగే భారత్ చేసి చూపించింది..

Date:

Jagdeep Dhankhar: భారత్ పాకిస్తాన్‌పై నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’‌ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రశంసించారు. పాకిస్తాన్ లోకి దూరి అమెరికన్ దళాలు అల్ ఖైదా చీఫ్ ‘‘ ఒసామా బిన్ లాడెన్’’ని చంపిన ఆపరేషన్‌తో పోల్చారు. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడిని ‘‘ఎప్పుడు జరగని లోతైన సరిహద్దు దాడి’’గా అభివర్ణించారు. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని భారత్ హతమార్చింది. దీనిని సెప్టెంబర్ 11, 2021లో జరిగిన అమెరికా దాడితో పోల్చారు.

Read Also: India Armenia: ఆర్మేనియాకు భారత “ఆకాష్ మిస్సైల్స్” .. టర్కీ, అజర్‌బైజాన్‌కి మూడింది..

ఒసామా బిన్ లాడెన్ పేరు నేరుగా చెప్పకుండా, మే 2, 2011న, అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులకు ప్లాన్ చేసిన ప్రపంచ ఉగ్రవాదిపై అమెరికా దళాలు ఇదే విధంగా వ్యవహరించాయని ఆయన అన్నారు. ‘‘భారత్ దీన్ని చేసింది. ప్రపంచానికి తెలియకుండానే దీన్ని చేసింది’’ అని జగదీప్ ధన్‌కర్ అన్నారు. శాంతి స్పూర్తిని కొనసాగిస్తూనే, ఉగ్రవాదంపై దాడి చేయడమే లక్ష్యంగా కొత్త విధానం నిర్ణయించబడిందని చెప్పారు. మొదటిసారిగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా స్థావరాలపై బలమైన దాడులు జరిగాయని అన్నారు. దాడులు అత్యంత ఖచ్చితమైన దాడులని, ఉగ్రవాదులకు మాత్రమే హాని జరిగిందని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ నుండి ప్రపంచ సమాజానికి సందేశం ఇచ్చారని ధంఖర్ అన్నారు. “అవి ఖాళీ మాటలు కావని ప్రపంచం ఇప్పుడు గ్రహించింది” అని ఆయన చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഒരു രാജ്യം ഒരു തെരഞ്ഞെടുപ്പ് 2029ല്‍ നടക്കില്ല; പ്രതിപക്ഷം ശക്തമായി പ്രതിഷേധിക്കുമെന്ന് കോണ്‍ഗ്രസ്

ന്യൂദല്‍ഹി: കേന്ദ്രസര്‍ക്കാര്‍ നടപ്പാക്കാനുദ്ദേശിക്കുന്ന ഒരു രാജ്യം ഒരു തെരഞ്ഞെടുപ്പ് പദ്ധതി 2029ല്‍...

'35 நிமிட விவாதம்; கப்சிப் உதயநிதி; பரந்தூரை தாங்கும் தங்கம் தென்னரசு! – பின்னணி என்ன?

சட்டமன்றத்தில் நடந்து வரும் மானியக் கோரிக்கை விவாதத்தின் போது பரந்தூர் விமான...

Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి

తమిళనాడు రాజకీయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో తీవ్ర...

225 ಗ್ರೇಡ್-1 ಪಂಚಾಯತ್ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಿಗೆ PDO ಹುದ್ದೆಗೆ ಬಡ್ತಿ: ಕೌನ್ಸಿಲಿಂಗ್

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,25,2026 (www.justkannada.in): ಗ್ರಾಮೀಣಾಭಿವೃದ್ಧಿ ಮತ್ತು ಪಂಚಾಯತ್ ರಾಜ್ ಇಲಾಖೆಯಲ್ಲಿ ಮಹತ್ವದ...