26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

PM Modi: రేపు ఏపీకి మోడీ.. అమరావతి పనులు ప్రారంభించనున్న ప్రధాని

Date:

ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోడీ  పున:ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే విశాఖలో యూనిటీ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.3,680 కోట్ల నేషనల్ హైవే పనులు ప్రారంభించనున్నారు. కాజీపేట–విజయవాడ 3వ లైన్ ప్రారంభం కానుంది. గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మోడీ ఈ ప్రారంభోత్సవం చేయనున్నారు.

ప్రధాని మోడీ శుక్రవారం ఏపీలో గంటా 25 నిమిషాల పాటు పర్యటించనున్నారు. మే 2న మధ్యాహ్నం 3:25కి రానున్నారు. ఇక సభా వేదికపై 14 మంది ఆసీనులు కానున్నారు. తొలుత మంత్రి నారాయణ ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్ ఇవ్వనున్నారు. చివరిగా ప్రధాని మోడీ ప్రసంగంతో సభ ముగియనుంది. ఇక ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని సభకు రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಜನರ, ಪಕ್ಷದ ಬೆಂಬಲ ಇಲ್ಲದಿದ್ದರೇ ನಾನು 17 ಬಜೆಟ್ ಮಂಡಿಸಲು ಹೇಗೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತಿತ್ತು-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in):  ನನಗೆ ರಾಜ್ಯದ ಜನರ ಪಕ್ಷದ ಹೈಕಮಂಢ್  ಬೆಂಬಲ...

സാദിഖലി തങ്ങളെ അപകീർത്തിപ്പെടുത്തിയുള്ള ഫേസ്ബുക്ക് പോസ്റ്റ്: കാപ്പ കേസ് പ്രതി ആവശ്യപ്പെട്ടത് 15 കോടി

മലപ്പുറം: സാദിഖലി തങ്ങളെ അപകീർത്തിപ്പെടുത്തിയുള്ള ഫേസ്ബുക് പോസ്റ്റിന് പിറകിലെ ലക്ഷ്യം ബ്ലാക്ക്...

ஸ்டாலின் Vs விஜய்… பெண்கள் வாக்குகளை வளைப்பதில் தீவிரம் | ‘வாவ்’ வியூகம் 10

பெண்கள் வாக்குகளை வளைப்பதில் தீவிரம்‘வாவ்’ வியூகம் 10வாக்காளர்கள் எதிர்பார்த்த ஜனநாயகத் திருவிழா...

Mermaid: రేజర్ షార్ప్ పళ్లు, చేప తోకతో మమ్మీ.. జపాన్‌లో సగం చేప సగం మానవుడి మెర్‌మెయిడ్

జపాన్‌లోని ఫుకుషిమాలోని ఒక పాత ఇంట్లో ఒక విచిత్రమైన మమ్మీ వెలుగుచూసింది....