26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

Bhadradri Kothagudem: ఫారెస్ట్ అధికారుల అమానుష చర్య.. రైతు మోటారు బోరులో రాళ్ళు వేసిన వైనం

Date:

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ అధికారులు అమానుష చర్యకు పాల్పడ్డారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల కర్కశంగా వ్యవహరించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే.. లక్షలు వెచ్చించి మోటారు బోర్లు తవ్వుకున్న రైతులకు తీరని నష్టాన్ని కలిగించారు. చర్ల మండలం పులిగుండాల గ్రామంలో ఫారెస్ట్ అధికారులు మోటారు బోరులో రాళ్లు వేశారు. మీడియం లక్ష్మీ అనే గిరిజన మహిళ రైతు పంట పొలంలో వేసిన మోటారు బోరులో ఫారెస్ట్ బీట్ అధికారి రాళ్ళు వేశాడు. ఐటిడి పిఓ, జిల్లా కలెక్టర్ల అనుమతులు ఉన్నప్పటికీ బోర్లను తొలగించారు అటవీ శాఖ అధికారులు. అధికారుల తీరుపై రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:Rajamouli : రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు.. IMDB నివేదిక..

అటవీ శాఖ అమానుష చర్యలను నిరసిస్తూ భద్రాచలం చర్ల ప్రధాన రహదారిపై పులిగుండాల గ్రామస్తుల రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఈ ఘటనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రెండు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వాహనదారులు. ఘటన స్థలానికి చేరుకున్న చర్ల సీఐ రాజు వర్మ, ఎస్ఐలు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪಾಲಿಕೆಯ 2026-27ನೇ ಆಯವ್ಯಯವು ‘ಸತ್ವ ಇಲ್ಲದ ಬಜೆಟ್’- ಮಾಜಿ ಮೇಯರ್ ಶಿವಕುಮಾರ್  ಟೀಕೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in): ಜನಸ್ನೇಹಿ ಪಾದಚಾರಿ ಮಾರ್ಗಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ 10 ಕೋಟಿ...

ഇറാന്റെ തിരിച്ചടിയില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നു; ഹോട്ടലുകളില്‍ അഭയം തേടി അമേരിക്കന്‍ സൈന്യം; റിപ്പോര്‍ട്ട്

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ പ്രത്യാക്രമണത്തില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നതോടെ, പശ്ചിമേഷ്യയിലെ യു.എസ് സേന...

"நாங்கள் சிரித்துக்கொண்டே அழுகிறோம்.!"- திமுக-வின் தொகுதிப் பங்கீடு குறித்து மதிமுக அர்ஜுனராஜ்

திமுக தங்களுக்கு கொடுத்த எண்ணிக்கை, சின்னம் தொடர்பாக தங்களுக்கு வருத்தம் உள்ளதாக...

Karnataka: క్లాస్‌లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ‘‘ఐ లవ్ యూ’’.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Karnataka: బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు....