4
March, 2026

A News 365Times Venture

4
Wednesday
March, 2026

A News 365Times Venture

Congress: కొత్త సీఈసీ నియామకంపై కాంగ్రెస్ అసంతృప్తి.. రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య

Date:

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత కేసీ.వేణుగోపాల్ మాట్లాడుతూ… సుప్రీంకోర్టు పరిశీలనను తప్పించుకోవడానికి.. తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇటువంటి చర్యతో ఎన్నికల ప్రక్రియపై సందేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు కేసీ.వేణుగోపాల్ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు.

ఇది కూడా చదవండి: MouniRoy : బికినీలో మౌని రాయ్.. మాములుగా లేదోయ్..

‘‘సీఈసీ నియామకం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సీఈసీ నియామక ప్యానెల్‌ నుంచి సీజేఐని తొలగించడంపై ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈలోపే కొత్త సీఈసీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు పరిశీలన లేకుండా సీఈసీని నియమించాలనే తొందరపాటు కేంద్ర ప్రభుత్వ చర్యలో భాగంగా​ కనిపిస్తోంది.’’ అని కాంగ్రెస్ తెలిపింది.

‘‘ఈ తొందరపాటు చర్యతో ఎన్నికల ప్రక్రియను బీజేపీ ఎంత నాశనం చేస్తోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యల వల్ల నకిలీ ఓటర్ల జాబితా, బీజేపీ అనుకూల ఎన్నికల షెడ్యూల్‌, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు బలపడతాయి’. అని కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. కొత్త సీఈసీగా జ్ఞానేష్‌కుమార్‌ సోమవారం నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుడికి అస్వస్థత.. చికిత్స పొందుతూ మృతి!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

രാജ്യസഭാ തെരഞ്ഞെടുപ്പ് കോണ്‍ഗ്രസിന് നിര്‍ണായകം; കൂടുതല്‍ സീറ്റുകള്‍ നേടിയാല്‍ പ്രതിപക്ഷത്തിരിക്കാം

ന്യൂദല്‍ഹി: രാജ്യസഭാ സീറ്റുകളിലേക്ക് നടക്കാനിരിക്കുന്ന തെരഞ്ഞെടുപ്പ് കോണ്‍ഗ്രസിന് നിര്‍ണായകം. പത്ത് വര്‍ഷത്തെ...

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో సెన్సేషనల్ ఎంట్రీ!

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక...