19
August, 2026

A News 365Times Venture

19
Wednesday
August, 2026

A News 365Times Venture

Hero Splendor: తక్కువ ధరకే, మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలా..!

Date:

ఇండియాలో చాలా మంది హీరో బైకులను నడపడానికి ఇష్టపడతారు. జనవరి 2025లో భారీగానే బైకులు సేల్ అయ్యాయి. గత నెలలో మొత్తం 6,28,536 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. వీటిలో టాప్-5 బైక్‌లు ప్రత్యేక స్థానాలు సాధించాయి. అందులో హీరో స్ప్లెండర్ భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

హీరో స్ప్లెండర్:
హీరో స్ప్లెండర్ బైక్‌ను హీరో మోటోకార్ప్ చాలా కాలంగా అందిస్తోంది. ఈ బైక్ ప్రతి నెలా అత్యధిక అమ్మకాలను చేస్తోంది. జనవరి 2025 సమయంలో ఈ బైక్ అత్యధికంగా ఇష్టపడిన బైక్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో మొత్తం 2,59,431 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో మొత్తం 2,55,122 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ బైకు తక్కువ ధరతో పాటు మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. సామాన్యులకు ఈ బైక్ అద్భుతంగా పని చేస్తుంది.

హోండా షైన్:
జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ద్వారా షైన్ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. అమ్మకాల పరంగా ఈ బైక్ రెండవ స్థానంలో ఉంది. జనవరి 2025లో ఈ బైక్ మొత్తం 1,68,290 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ బైక్ 1,45,252 యూనిట్లు సేల్ అయ్యాయి. మంచి మైలేజ్ ఇచ్చే బైకులలో ఇది కూడా ఒకటి.

బజాజ్ పల్సర్:
బజాజ్ పల్సర్ మూడవ స్థానంలో నిలిచింది. సరికొత్త డిజైన్‌తో ప్రజలకు పరిచయం చేయబడిన ఈ బైక్.. గత నెలలో దేశవ్యాప్తంగా 1,04,081 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ బైక్‌ను 1,28,883 మంది కొనుగోలు చేశారు. డేటా ప్రకారం.. ఈ బైక్ అమ్మకాలు దాదాపు 20 శాతం తగ్గాయి.

హీరో HF Dlx:
హీరో మోటోకార్ప్ యొక్క HF Dlx బైక్ కూడా చాలా మందికి ఇష్టం. గత నెలలో ఈ బైక్ మొత్తం 62,223 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి 2025లో దేశవ్యాప్తంగా 78,767 యూనిట్లు సేల్ అయ్యాయి. టాప్-5 టీవీఎస్ బైక్‌లో టీవీఎస్ అపాచీ కూడా టాప్-5లో చోటు దక్కించుకుంది. గత నెలలో కంపెనీ అందిస్తున్న టీవీఎస్ అపాచీ బైక్‌ను కూడా 34,511 మంది కొనుగోలు చేశారు. గత సంవత్సరం జనవరి నెలలో ఈ బైక్‌ను 31,222 మంది కొనుగోలు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bihar: AK-47 ఘటనపై నిరసన.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్..

Bihar: బీహార్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాట్నాలో ఆర్జేడీ నిర్వహించిన రాజ్‌భవన్...

ಯೂಟ್ಯೂಬರ್‌ ಗಳಿಗೂ ಪೊಲೀಸ್‌ ನಿಗಾ?  ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮಕ್ಕೆ ಕಮಿಷನರ್ ಸೀಮಾ ಲಾಟ್ಕರ್ ಖಡಕ್ ಎಚ್ಚರಿಕೆ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,19,2026 (www.justkannada.in):  ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ಕ್ಷಣಾರ್ಧದಲ್ಲಿ ಲಕ್ಷಾಂತರ ಜನರನ್ನು...

“சர்கார் பேனரை கிழித்ததால் அதிமுக ஆட்சியை இழந்தது!'' – அமைச்சர் ஆனந்த் கடும் விமர்சனம்

சட்டமன்றத்தில் இன்று நீர்வளத்துறை மீதான மானியக் கோரிக்கை விவாதம் நடந்திருந்தது. இதில்...