26
June, 2026

A News 365Times Venture

26
Friday
June, 2026

A News 365Times Venture

Piduguralla: ఉత్కంఠ రేపుతున్న పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్ ఎన్నిక..

Date:

Piduguralla: పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే రెండు సార్లు కోరం లేకపోవడంతో వాయిదా పడగా.. మరోసారి ఇలాంటి సమస్య రాకుండా టీడీపీ ప్లాన్ చేసింది.. దీంతో వైస్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఇక, కౌన్సిల్లో వైసిపికి పూర్తిస్థాయి బలం.. మొత్తం 33 మంది వైసీపీ కౌన్సిలర్లే అయినా వైస్ ఛైర్మన్ పోస్టుపై తెలుగు దేశం పార్టీ కన్నేసింది. కానీ, టీడీపీ గూటికి పలువురు వైసీపీ కౌన్సిలర్లు చేరుతున్నారు. ఇప్పటికే, 17 మందికి పైగా కౌన్సిలర్లు సైకిల్ గూటికి చేరినట్లు సమాచారం.

Read Also: GBS: జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి.. స్పందించిన మంత్రి డోలా

ఇక, రహస్య ప్రాంతంలో వైసీపీ కౌన్సిలర్లతో టీడీపీ క్యాంప్ రాజకీయం నడుపుతుంది. ఎన్నిక సమయానికి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా తెలుగు దేశ పార్టీ ప్లాన్ చేసింది. మరోవైపు, తమకు టీడీపీ విధానాలు నచ్చడంతోనే ఫ్యాన్ పార్టీని వీడుతున్నామంటున్న కొందరు కౌన్సిలర్లు తెలియజేస్తున్నారు. తమ కౌన్సిలర్లను బెదిరించి, పోలీసుల అండతో దాచి పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న వైస్ చైర్మన్ ఎన్నికలలో ఎలాంటి ట్విస్టులు నెలకొంటాయో అనే ఆసక్తి కొనసాగుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

அமலுக்கு வரும் பாஸ்போர்ட் திருத்தச் சட்டம்; ஏறும் பாஸ்போர்ட் கட்டணம்; எவ்வளவு, எப்போது முதல்?

மத்திய வெளியுறவுத் துறை அமைச்சகம் 'பாஸ்போர்ட் திருத்தச் சட்டம், 2026'-ஐ கொண்டு...

Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!

Benefits of Hugging: ప్రస్తుత ఆధునిక జీవితంలో పనిఒత్తిడి, కుటుంబ బాధ్యతలు,...

ಕೆಎಸ್‌ ಒಯುಗೆ ನೂತನ ಕುಲಪತಿಯಾಗಿ ಡಾ. ಜ್ಞಾನ ಪ್ರಕಾಶ್ ನೇಮಕ

ಮೈಸೂರು,ಜೂನ್,25,2026 (www.justkannada.in):  ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮುಕ್ತ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯ (KSOU)ದ ನೂತನ...