13
April, 2026

A News 365Times Venture

13
Monday
April, 2026

A News 365Times Venture

KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు

Date:

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఒకరి దోపిడీని మరొకరు బయటపెట్టకుండా పరస్పరం కాపాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంట్రాక్టుల కేటాయింపులో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న “ఇచ్చి-పుచ్చుకునే బంధం” స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో వందల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అమృత్’లో కూడా ఆయనకే భారీగా టెండర్లు దక్కేలా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ఎంపీలకు కూడా కాంట్రాక్టులు ఇస్తున్నారని, ఇలా ఒకరికొకరు లబ్ధి చేకూర్చుకుంటూ దోపిడీని సాగిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో చేసిన ‘ఆర్ఆర్ టాక్స్’ (రాహుల్-రేవంత్ టాక్స్) వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద ఈ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని స్వయంగా ఆరోపించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటివరకు దానిపై ఎందుకు విచారణ జరిపించలేదని ఆయన నిలదీశారు. అవినీతి జరుగుతోందని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ , బీజేపీలు కేవలం ప్రజల కళ్లముందు మాత్రమే కొట్లాడుకుంటున్నాయని, కానీ అంతర్గతంగా మాత్రం బ్రహ్మాండమైన దోస్తీని కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ఒకరి అవినీతిని మరొకరు దాచిపెడుతూ తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని, ఈ “చీకటి దోస్తుల” వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు.

Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബംഗാളിനെ മൂന്നായി വിഭജിക്കാനാണ് ബി.ജെ.പി പദ്ധതിയിടുന്നത്, അതിനാണ് ആ ബില്‍; വിമര്‍ശിച്ച് മമത

  കൊല്‍ക്കത്ത: മണ്ഡല പുനര്‍നിര്‍ണയം വഴി പശ്ചിമ ബംഗാളിനെ മൂന്നായി ഭാഗങ്ങളായി...

சேலம்: பிரசாரத்தின்போது மேடையிலேயே மயங்கிய ராமதாஸ்; என்ன நடந்தது?

பாமக நிறுவனர் ராமதாஸ் சேலம் பள்ளப்பட்டியில் பரப்புரையில் ஈடுபட்டிருந்தபோது திடீரென மயங்கி...

ಸಂಪುಟ ಪುನರ್ರಚನೆ ಹೈಕಮಾಂಡ್ ಗೆ ಬಿಟ್ಟಿದ್ದು ; ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ

  ಚಿಕ್ಕಮಗಳೂರು, ಏಪ್ರಿಲ್ 12: ಸಚಿವ ಸ್ಥಾನದ ಆಕಾಂಕ್ಷಿ ಶಾಸಕರು ನವದೆಹಲಿಗೆ...