Petrol, Diesel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాల ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ప్రపంచ చమురు సరఫరాపై ఒత్తిడిని కొనసాగిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం ధరను లీటరు ధరను ఏకంగా మూడు రెట్లు పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ హై-ఆక్టేన్ పెట్రోల్ ధర రూ. 321.17కు, డీజిల్ ధర రూ. 335.86కు చేరుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం అంటే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్ల వంటి అధిక-కంప్రెషన్ ఇంజిన్లలో వాడుతారు. ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఇంధన ధరలు, విస్తృత ఆర్థిక ఉపశమన చర్యలను సమీక్షించింది. లీటరుకు పీకేఆర్ 200 మేర పెంచిన ఈ భారీ పెంపు, సాధారణంగా విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ ఇంధనాన్ని లక్ష్యంగా చేసుకుంది.
READ MORE: Unbroken IPL Records: 18 సీజన్ల తర్వాత కూడా చెక్కుచెదరకుండా.. ఐపీఎల్ తొలి సీజన్ రికార్డులు
“ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి నెలకు 9 బిలియన్ల రూపాయలు ఆదా అవుతాయి. ఈ ఆదా అయిన సొమ్ముతో ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఈ భారం దేశంలోని అత్యంత సంపన్న వర్గం మాత్రమే భరిస్తుంది కాబట్టి, ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుంది.” అని ప్రధాని షరీఫ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రజా రవాణా ఛార్జీలు లేదా విమాన ప్రయాణ ఖర్చులపై ప్రభావం పడదని, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ సాధారణ ప్రజలకు కొంత ఊరట లభిస్తుందని షరీఫ్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ ఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు పీకేఆర్ 55 మేర పెంచిన పాకిస్థాన్ తాజాగా మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.





