పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు బుధవారం వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించనుంది. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఇఫ్తార్ విందును వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సామరస్యానికి, సాంప్రదాయాలకు ప్రతీకగా జరగనుంది. ఈ ఇఫ్తార్ విందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణలో పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.
Also Read: Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో డబ్బే డబ్బు!
రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రేమ, శాంతి, సోదరభావాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఉండనుంది. వైఎస్ జగన్ సాయంత్రం 6 గంటలకు విజయవాడకు చేరుకుని ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 7 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు హాజరుకానున్నారు.





