హిందూపూర్ స్టేషన్లో కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ నైరుతి రైల్వే (South Western Railway) నిర్ణయం తీసుకుంది. రైలు కార్యకలాపాలను మరింత మెరుగుపరచడానికి, సమయపాలన పాటించడానికి ఈ కొత్త సమయాలు మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
యశ్వంతపూర్ – కాచిగూడ వందే భారత్ (ట్రైన్ నంబర్ 20704): ఇది హిందూపూర్కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని, 3.57 గంటలకు బయలుదేరుతుంది. (గతంలో ఇది 3.48 గంటలకు వచ్చి, 3.50 గంటలకు బయలుదేరేది).
కాచిగూడ – యశ్వంతపూర్ వందే భారత్ (ట్రైన్ నంబర్ 20703): ఇది హిందూపూర్కు మధ్యాహ్నం 12.17 గంటలకు చేరుకుని, 12.19 గంటలకు బయలుదేరుతుంది. (గతంలో ఇది 12.08 గంటలకు వచ్చి, 12.10 గంటలకు బయలుదేరేది).
Also Read:AI Effect: ఏఐతో ఉద్యోగాలు కోల్పోయే 10 రంగాలు ఇవే.. జాబితా వెల్లడించిన ఆంత్రోపిక్..
ప్రయాణికులు ఈ కొత్త సమయాలను గమనించి.. తమ ప్రయాణాలను దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైలు ప్రయాణంలో జాప్యాన్ని తగ్గించి, సేవలను మరింత వేగవంతం చేయడానికి ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇలా ఉండగా.. యశ్వంత్ పూర్ టు కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ వారంలో 6 రోజులు రాకపోకలు సాగిస్తుంది. బుధవారం ఒక్క రోజు ఈ రైలు సర్వీస్ ఉండదు. ఇక ఈ ట్రైన్ కాచిగూడ నుంచి బయలు దేరి మహబూబ్నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.





