7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

Storyboard : ఏపీలో కుల రాజకీయం పాతబడిందా..? కొత్తగా మత రాజకీయం మొదలైందా..?

Date:

Storyboard: ఏపీలో కొత్తగా మత రాజకీయం మొదలైంది. ఎవరు హిందువు..? ఎవరు క్రిస్టియన్..? అనే కొత్త చర్చకు తెరలేపారు నాయకులు. ఏ పార్టీ సిద్ధాంతం ఏంటి..? ఏ నేత వ్యవహారశైలి ఎలా ఉంది..? అనే విషయాల కంటే ఏ నాయకుడి మతం ఏంటనేదే ప్రధానంగా మారిపోయింది. ఏకంగా చట్టసభల్లోనే మతం గురించి చర్చ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ కల్తీతో మొదలైన రగడ కాస్తా ఇప్పుడు మత రాజకీయంగా మలుపు తిరగటంపై చర్చ జరుగుతోంది. ఏపీలో మొదట్నుంచీ కుల రాజకీయాలే నడిచాయి. కానీ ఆ ఫార్ములా పాతబడిందని నేతలు భావిస్తున్నట్టుగా ఉంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా చర్చను మతం చుట్టూ తిప్పుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. మతం పేరుతో ఓటర్లను పోలరైజ్ చేయాలనే ఉద్దేశంతోనే.. కొత్త రచ్చకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. ఏపీలో 2024 ఎన్నికల ముందు వరకూ అన్ని పార్టీలూ కులం గురించే మాట్లాడేవి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్తగా మతం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాయి.

శాసనమండలిలో ఓ రోజంతా మతం గురించే రచ్చ జరిగింది. ఏకంగా మండలి ఛైర్మన్ మతాన్ని కూడా ప్రస్తావించడంతో కలకలం రేగింది. ఎవరి మతం ఏంటో క్లారిటీ ఉండాలని అధికార పక్షం.. విషయాన్ని తప్పుదోవ పట్టించొద్దని విపక్షం పరస్పర వాదనకు దిగాయి. అల్టిమేట్‌గా రెండు పక్షాలు ఎవరి మతం ఏమిటనే విషయం గురించి ఎక్కువగా పట్టుబట్టాయి. ఇక్కడ ఎవరి మతం ఏమిటి అనే చర్చకు మాత్రమే పరిమితమైనా పర్వాలేదనుకోవచ్చు. కానీ చర్చ శృతి మించి రాగాన పడింది. నేతలు ఏ స్థాయికి వెళ్లారంటే హిందువైతే ఇలా ఉంటాడు. క్రిస్టియన్ లేదా ముస్లిం అయితే అలా ఉంటాడని నిర్ణయించేస్తున్నారు. ఇలా మతాల్ని బట్టి వ్యక్తులకు వ్యక్తిత్వాలు అంటగట్టడం వివాదాస్పదమౌతోంది. ఓ మతాన్ని పాటించేవారంతా అలాగే ఉంటారని ఎక్కడా లేదు. మతం ఏదైనా.. దాన్ని అనుసరించే వ్యక్తుల్లో మంచీ, చెడ్డా రెండూ ఉంటాయి. అంతే కానీ ఓ మతం వారంతా పునీతులు.. మరో మతం వారంతా అపవిత్రులు అవుతారా అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. కానీ ఏపీలో నేతలు మాత్రం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయారు. మతం గురించి బహిరంగ చర్చ చేయకూడదనే నియమాన్ని కూడా గాలికొదిలేసి.. నోటికొచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ఇంట్లో పాటించే మతాన్ని బజార్లో పెట్టి.. హోల్‌సేల్‌గా అన్ని మతాల పరువూ తీస్తున్నారు. అదేమంటే పారదర్శకత అంటూ వింత వాదన వినిపిస్తున్నారు.

నిజానికి టీటీడీ గురించో, వేంకటేశ్వర స్వామి గురించో, లడ్డూ నాణ్యత గురించో చర్చ జరగటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ మధ్యలో మతం గురించిన చర్చకు ప్రాధాన్యత ఇవ్వడం మీదే అభ్యంతరాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలోనూ చట్టసభల్లో చాలాసార్లు టీటీడీలో జరిగే వ్యవహారాలు, కొండ మీద అపచారం జరుగుతుందనే అంశాలపై చర్చలు జరిగాయి. కానీ ఎప్పుడూ ఏ నాయకుడూ అందులో మతాన్ని కలగలిపి మాట్లాడలేదు. కేవలం ఇష్యూను ఇష్యూగానే చూశారు తప్ప.. మత ప్రస్తావన తెచ్చి.. ప్రత్యర్థుల్ని మతం పేరుతో ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం జరగలేదు. కానీ ఈసారి మాత్రం చర్చ ఎప్పటిలాగే సజావుగా మొదలైన.. తర్వాత తొందరగానే పక్కదోవ పట్టి.. అసలు విషయం వదిలేసి.. కొసరు అంశం చుట్టూ తిరిగింది. రాష్ట్ర సమస్యల గురించి మండలిలో చర్చ జరుగుతుందని ఆశగా ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలకు నిరాశను మిగిలిస్తూ.. నేతలు అనూహ్యంగా మత రాజకీయం ఎత్తుకున్నారు. అసలు ఏపీకి అలవాటులేని ఈ కొత్త పోకడ ఏమిటని ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నేతల తీరు చూస్తుంటే.. ఇప్పటిదాకా ఉత్తరాదికే పరిమితమైన మత రాజకీయాన్ని దక్షిణాదికి తీసుకురావాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ చర్చకు ఇంతటితో ఫుల్‌స్టాప్ పెడతారా.. ఎన్నికల దాకా సాగదీసే ఉద్దేశంతో ఉన్నారా అనే విషయం తేలాల్సి ఉంది.

మతం గురించి ఇంత చర్చ చేయడంపై ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టీటీడీలో ప్రక్షాళన సంగతి వదిలేసి.. ఈ అనవసర రచ్చ ఏంటనే వాదన వినిపిస్తోంది. రాజకీయ నాయకులు ఏం చేయాలి..? అధికారంలో ఉన్నవారి బాధ్యతలేంటి..? విపక్షం నిర్వర్తించాల్సిన బాధ్యతలేంటి..? అనే ప్రశ్నలకు చాలా స్పష్టమైన జవాబులున్నాయి. కానీ వాటి జోలికి పోవటానికి ఇష్టపడని నేతలు.. ప్రజల్ని తేలికగా ప్రభావితం చేయటానికి మతాన్ని నమ్ముకుంటున్నట్టుగా కనిపిస్తోంది. కానీ అతి సర్వత్ర వర్జ్యయేత్ అన్నారు. దేవుడికి అపచారం జరగకూడదని అందరూ కోరుకుంటున్నా.. మతం గురించి చట్టసభల్లో చర్చించాలని మాత్రం అనుకోవడం లేదనడంలో సందేహం లేదు. ఏపీలో నేతలు ఏ స్థాయికి వెళ్లారంటే ఓ వ్యక్తి మతాన్ని బట్టి.. అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయించేస్తున్నారు. అసలు మతం ప్రసక్తి లేకుండా రాజకీయం చేయాలనే మాటే మరిచిపోయారు. పనిగట్టుకుని మతాన్ని చర్చ మధ్యలోకి తీసుకొస్తున్నారు. నిజానికి ఏపీలో ప్రజలు ఏ మతం అవలంబించినా.. ఇతర మతాలపై ద్వేషంతో ఉండరు. నేతలు కూడా అలాగే ఉండారని ఆశిస్తారు. అంతేకానీ ఎవరూ ఊహించని విధంగా శాసనమండలిలో రాజుకున్న మత చిచ్చు.. ఎక్కడకు దారితీస్తుందనేది అంతుచిక్కటం లేదు.

ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు దగ్గరపడింది. కానీ ఇంతవరకూ ఏపీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ప్రజల్లో చాలా ఆకాంక్షలున్నా.. ప్రభుత్వాలు మారినా.. ఎవరూ వాటిని అందుకోలేకపోతున్నారు. అసలు ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఎంత పని చేసినా తరగని పనుంది. ఎన్ని విధానాలకు రూపకల్పన చేసినా.. ఇంకా కొత్త విధానాలకు ఛాన్సుంది. కానీ అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ అసలు విషయాలు గాలికొదిలేసి.. మతం గురించి లోతైన చర్చకు తెరతీశాయి. సాక్షాత్తు మండలి ఛైర్మన్ మతం గురించిన చర్చ ఇక చాలని వారించినా.. ఎవ్వరూ ఎక్కడా తగ్గటం లేదు. సీఎం స్థాయిలో ఎవరున్నా.. వారు అన్ని మతాల కార్యక్రమాలకు హాజరవ్వటం మామూలే. సీఎంగా ఎవరున్నా.. వారి వ్యక్తిగతంగా ఏ మతం అవలంబించినా.. మరో మతం కార్యక్రమాలకు హాజరుకాబోనని ఎవ్వరూ అనరు. అనలేరు. అన్ని మతాల ప్రముఖ పండగల ఉత్సవాల్లోనూ అన్ని పార్టీలూ పాలుపంచుకుంటాయి. ఇక్కడ ఎలాంటి మతపరమైన పరిమితులు పెట్టలేదు. దీనికి తోడు రాజ్యాంగంలో కూడా లౌకిక భావన ఉంది. కాబట్టి రాజకీయ నేతలు కూడా లౌకికవాదులుగా ఉండాల్సిందే. ఓ మతం రంగు పులుముకునేవారికంటే.. అందరికీ దగ్గరే అనేవారికి ఎక్కువ ఓట్లు పడతాయని కూడా మొన్నటిదాకా ఏపీలో రాజకీయ నేతలు భావించేవారు. కానీ సడెన్‌గా నేతలకు ఏమైందో ఏమో కానీ.. ఎవ్వరూ ఆశించని అంశం గురించి చర్చ మొదలుపెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు.

టీటీడీ పవిత్రత గురించి చర్చించటానికి హిందువే కావాల్సిన పని లేదు. టీటీడీలో ఎలాంటి నియమాలు పాటించాలో పుస్తకాల్లో వివరంగా ఉంది. దానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే సరిపోతుంది. అవి పాటిస్తే ఓకే.. లేకపోతే ఏ మతం వారినైనా శిక్షించాల్సిందే. అంతే కానీ హిందువులైతే నియమాలు ఉల్లంఘించరు. ఇతర మతాల వారైతే కచ్చితంగా ఉల్లంఘిస్తారనే సూత్రం ఎవరూ ఫిక్స్ చేయలేరు. అదే సందర్భంలో మసీదులు, చర్చిల పవిత్రత గురించి మాట్లాడటానికి ముస్లింలు, క్రిస్టియన్లు కావాల్సిన అవసరం లేదనే కామన్ సెన్స్ ఏపీ ప్రజలకు పుష్కలంగా ఉంది. కానీ నేతలకు ఎందుకు అది కొరవడుతుందనేదే అతి పెద్ద ప్రశ్న. ప్రార్థనామందిరాల విషయంలో ఎవరి ఆచారాలు వారికుంటాయి. అవి తుచ తప్పకుండా అమలు కావాల్సిందే. అంతేకానీ ఆ మతం కానంతమాత్రాన పనికట్టుకుని ప్రార్థనామందిరాల్ని అపవిత్రం చేస్తారని, ప్రతిష్ఠ దెబ్బతీస్తారని ముద్ర వేయటం తప్పవుతుంది. సరైన సాక్ష్యాధారాలుంటే విచారణ చేసి శిక్ష విధించవచ్చు. అప్పుడు ఎవరూ కాదనే అవకాశం ఉండదు. అంతే కానీ మతం ఆధారంగా జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ పోతే.. ఇక పోలీసులు, కోర్టులకు పనేముందనే చర్చ జరుగుతోంది.

ఏ మతంలో అయినా భిన్నప్రవృత్తులు కలవారుండటం సహజం. అందరూ దేవుడి విషయంలో ఒకే రకమైన భక్తిశ్రద్ధలతో ఉండరు. అంతమాత్రాన భక్తి తక్కువగా ఉన్నవారే అపచారాలు చేస్తారనే సిద్ధాంతాన్ని స్థిరం చేస్తే.. చాలా అనర్థాలు జరిగిపోతాయి. అలాగని పూజలు, పునస్కారాలు చేసేవారంతా పవిత్రాత్ములే అనుకున్నా కొంప మునుగుతుంది. ఇక్కడ భక్తికీ, వ్యక్తిత్వానికీ సంబంధం లేదని చెప్పటానికి చాలా ఉదాహరణలున్నాయి. వాటి గురించి తెలిసి కూడా నేతలు పనిగట్టుకుని మతం పేరు చెప్పి వ్యక్తిత్వహననాలకు దిగటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఓ వ్యక్తి మతాన్ని బట్టి అతని గుణగణాల్ని నిర్ణయిస్తారా..? అనే ప్రశ్నకు ఏ పార్టీ అయినా, ఏ నేత అయినా సమాధానం చెప్పగలరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు, నేతలు ఎలా ఉండాలో అందరికీ తెలుసు. ఎక్కడైనా ప్రజలు శృతి తప్పితే సరిచేయాల్సిన నేతలు.. వారే స్వయంగా బరితెగించి వ్యవహరించటం నిజంగా సిగ్గుచేటు. అసలు ఏపీ చరిత్రలో లేని మత రాజకీయాన్ని కొత్తగా తెచ్చి తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని రేపొద్దున జనం తిరగబడితే ఏం చేస్తారు..? ఎవరెన్ని ఎత్తులేసినా.. మతం ఆధారంగా ఓట్లు పడవనేది ఏపీ ఎన్నికల చరిత్ర చెప్పే సత్యం. గతంలో ఏపీలో కులం ఆధారంగా రాజకీయం నడిచిన మాట వాస్తవం. పార్టీలు కులసమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని టికెట్లిచ్చేవారు, పదవులు భర్తీ చేసేవారు. అలాగే కొందరు ఓటర్లు కూడా కులాన్ని బట్టి ఓట్లేసేవారు. కానీ ఏనాడూ మతం చూసి ఓట్లేసిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడు ఆ పోకడ కూడా తీసుకురావాలని ఏపీ నేతలు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నారు. అందుకే పనిగట్టుకుని మరీ మతం గురించి అనవసర చర్చ చేస్తున్నారు. ఈ వ్యవహారశైలి ఇలాగే కొనసాగితే.. రేపొద్దున ప్రతి పండుగ ఎలా చేయాలో.. ఎక్కడ ఎవరి వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా.. దాన్ని మతాల మధ్య చిచ్చుగా ఎలా రేపాలో కూడా నేతలు ప్రయత్నించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఏపీ ఓటర్లకు రాజకీయ చైతన్యం ఎక్కువనేది దేశవ్యాప్తంగా తెలిసిన విషయం. కొన్నిసార్లు దేశానికే మార్గనిర్దేశం చేసిన చరిత్ర ఏపీ రాజకీయాలకు ఉంది. అలాంటి ఏపీని ఇప్పటి నేతలు ఉద్దేశపూర్వకంగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయం. ఎవరేమనుకున్నా.. తాము మాత్రం పద్ధతి మార్చుకునేది లేదని ఏపీ జనం ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా మతం మంటలు రేపి.. వాటిలో చలి కాచుకోవాలనే ప్రయత్నం ఇప్పటికైనా ఆపేయాలని పార్టీల్ని హెచ్చరిస్తున్నారు. చేతనైతే రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలి కానీ.. ఈ మత పిచ్చి ఎక్కించుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.

ఏపీ రాజకీయానికీ, మిగతా రాష్ట్రాల రాజకీయానికీ కచ్చితమైన తేడా ఉంది. ఇక్కడ ఓటరు తీర్పు ఎప్పుడూ సంక్లిష్టంగా ఉంటుంది. భిన్న అంశాలను బేరీజు వేశాకే తీర్పిస్తారు. అంతేకానీ ఏదో ఒక్క అంశం మీద మాత్రమే ఆధారపడి ఓటేసే పద్ధతి ఎప్పుడూ లేదు. చాలాసార్లు రాజకీయ నేతలకు ఓటర్ల తీర్పు అర్థం కాక జుట్టుపీక్కున్న సందర్భాలున్నాయి. ఎన్నికలు జరిగి రెండేళ్లైనా ఇప్పటికీ కొందరు నేతలకు ఓటరు తీర్పు స్పష్టంగా అర్థం కాలేదంటే నమ్మాల్సిందే. ఇలాంటి విషయాలపై అవగాహన తెచ్చుకోని నేతలు.. అవసరం లేకున్నా మతం గురించి రచ్చ చేయటం విడ్డూరంగా ఉంది. ఏపీ ప్రజలు ప్రతిసారీ మార్పుకే పట్టం కడుతూ వచ్చారు. అభివృద్ధి విషయంలో కూడా అందరికంటే ముందుండాలనే ఆకాంక్ష కూడా ఎక్కువ. దానికి అనుగుణంగానే కొత్త పాలసీలతో వచ్చిన పార్టీలకు ఆదరణ దక్కుతూ వచ్చింది. ఏపీలో అన్నిమతాల వారూ ఉన్నారు. కానీ వారి మధ్య మతాల గురించిన చర్చ కంటే.. అభివృద్ధి, ఉపాధి గురించిన చర్చే ఎక్కువగా వస్తుందనడంలో సందేహం లేదు. అందుకే దేశంలో కొన్నిచోట్ల మతఘర్షణలు రేగినా.. ఆ ప్రభావం ఏపీ ప్రజలపై ఎప్పుడూ పడలేదు. చివరకు పొరుగు రాష్ట్రంలో దశాబ్దాల పాటు మతఘర్షణలు జరిగినప్పుడు కూడా ఏపీలో మతసామరస్యానికి ఎప్పుడూ సమస్య రాలేదు. అంతగా ఏపీ జనం మతం విషయంలో పూర్తి పరిణతితో వ్యవహరిస్తారు. అంతే కానీ ఉత్తరాది మాదిరిగా.. ప్రతి చిన్న విషయానికీ మతంతో ముడిపెట్టి రెచ్చిపోయే అలవాటు ఎప్పుడూ లేదు. అందుకే మతం ఆధారంగా రాజకీయం చేసే పార్టీలకు ఏపీ కొరుకుడుపడలేదు. ఈ సంగతి తెలిసి కూడా ఏపీలో ప్రాంతీయ పార్టీలు కూడా కొత్తగా మత రాజకీయం ఎందుకు మొదలుపెట్టాయనేది ఎవరికీ అంతుచిక్కని విషయం.

ఇప్పటి నేతలు ఇలా ఉన్నారు కానీ.. గతంలో ఏపీ నేతలు కూడా ఎంతో సంయమనం పాటించేవారు. అసలు బహిరంగంగా మత ప్రస్తావన తేవటానికే ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. సీనియర్ నేతలైతే దేవుడు, మతం గురించి ప్రస్తావించినా, శుభాకాంక్షలు చెప్పినా, అభినందనలు చెప్పినా.. అవి ఏ మతానికో కూడా తెలియనంత నిగూఢంగా, నర్మగర్భంగా చెప్పేవారు. అంతేకానీ ఇప్పటిలాగా చికెన్ తిన్నాం కాబట్టి ఎముకలు మెడలో వేసుకుని తిరగాలనే ధోరణి ఎప్పుడూ లేదు. మరి అలాంటి రాజకీయ వారసత్వం ఉన్న ఏపీలో ఇప్పుడు నేతలు ఎందుకు ఇలా తయారయ్యారనేది తేలాల్సిన ప్రశ్న. అసలు ప్రస్తుతం ఏపీ నేతలు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని, కచ్చితంగా ప్రజలు కీలెరిగి వాత పెడతారనే వాదన కూడా లేకపోలేదు.

మత రాజకీయానికి తెరలేపిన నేతలు.. ఏదో జరుగుతుందని ఆశిస్తున్నారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగినా ఆశ్చర్యం లేదనేది రాజకీయ పరిశీలకుల మాట. ఎందుకంటే ఎక్కడైనా ఓటర్ల ఆలోచనా ధోరణి ఎప్పుడూ నేతల ఊహకు అందని విధంగానే ఉంటుంది. దానికి ఏపీ కూడా మినహాయింపు కాదు. అసుల మాకు కావాల్సిందేమిటి..? వీళ్లు మాట్లాడుతున్నదేమిటి..? అనే చర్చ ఇప్పటికే ఏపీ పౌర సమాజంలో మొదలైంది. నేతలు ఎవరికి వారు పంతాలు, పట్టింపులకు పోయి మతం గురించి బహిరంగ చర్చలు పెట్టడం, ఎవరి మతం ఏమిటో తెలియాలని పట్టుబట్టడం పూర్తిగా అసందర్భ ప్రేలాపనే అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అగ్రనేతలైనా, మరే నేతలైనా వారి వ్యక్తిగతాల గురించి జనానికి అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా వారి పనితీరు ఎలా ఉందనేది మాత్రమే. దాన్ని బట్టే ప్రజలు నేతల్ని ఆదరిస్తారు. అంతేకానీ కేవలం మతం ఆధారంగా ఏ నేతకూ బ్రహ్మరథం పట్టే సంస్కృతి ఏపీలో గతంలో లేదు. ఇప్పుడు వస్తుందనుకోవటం కూడా ఒట్టి భ్రమే. ఎందుకంటే నేతల మతం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఫలానా నేత ఓ మతం వారైనంత మాత్రాన.. ఆయనకు ఓటేసేవారంతా అదే మతానికి ప్రభావితులు కావాలనే రూల్ ఎక్కడా లేదు. అలా కావడం కూడా జరగAnchor []
దేశంలో కొన్నిచోట్ల మత ఘర్షణలు జరిగాయి. అలాగే ఉత్తరాది రాజకీయం దశాబ్దాలుగా మతం చుట్టూనే తిరుగుతోంది. ఏపీ కూడా కొన్నిసార్లు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. కానీ ఏనాడూ ఏపీ నేతలు మత రాజకీయాల జోలికి పోలేదు. మతానికీ, రాజకీయానికి ఉన్న విభజన రేఖను స్పష్టంగా గౌరవించారు. అటు రాష్ట్ర ప్రజలు కూడా మత సామరస్యాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ.. వచ్చారు. కానీ ఇప్పుడు ఏపీ నేతలు రేపుతున్న మతం మంటలు.. ఎటుదారితీస్తాయోననే ఆందోళన కనిపిస్తోంది.

ఏపీ ప్రజలు ప్రతిసారీ మార్పుకే పట్టం కడుతూ వచ్చారు. అభివృద్ధి విషయంలో కూడా అందరికంటే ముందుండాలనే ఆకాంక్ష కూడా ఎక్కువ. దానికి అనుగుణంగానే కొత్త పాలసీలతో వచ్చిన పార్టీలకు ఆదరణ దక్కుతూ వచ్చింది. ఏపీలో అన్నిమతాల వారూ ఉన్నారు. కానీ వారి మధ్య మతాల గురించిన చర్చ కంటే.. అభివృద్ధి, ఉపాధి గురించిన చర్చే ఎక్కువగా వస్తుందనడంలో సందేహం లేదు. అందుకే దేశంలో కొన్నిచోట్ల మతఘర్షణలు రేగినా.. ఆ ప్రభావం ఏపీ ప్రజలపై ఎప్పుడూ పడలేదు. చివరకు పొరుగు రాష్ట్రంలో దశాబ్దాల పాటు మతఘర్షణలు జరిగినప్పుడు కూడా ఏపీలో మతసామరస్యానికి ఎప్పుడూ సమస్య రాలేదు. అంతగా ఏపీ జనం మతం విషయంలో పూర్తి పరిణతితో వ్యవహరిస్తారు. అంతే కానీ ఉత్తరాది మాదిరిగా.. ప్రతి చిన్న విషయానికీ మతంతో ముడిపెట్టి రెచ్చిపోయే అలవాటు ఎప్పుడూ లేదు. అందుకే మతం ఆధారంగా రాజకీయం చేసే పార్టీలకు ఏపీ కొరుకుడుపడలేదు. ఈ సంగతి తెలిసి కూడా ఏపీలో ప్రాంతీయ పార్టీలు కూడా కొత్తగా మత రాజకీయం ఎందుకు మొదలుపెట్టాయనేది ఎవరికీ అంతుచిక్కని విషయం.

ఇప్పటి నేతలు ఇలా ఉన్నారు కానీ.. గతంలో ఏపీ నేతలు కూడా ఎంతో సంయమనం పాటించేవారు. అసలు బహిరంగంగా మత ప్రస్తావన తేవటానికే ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. సీనియర్ నేతలైతే దేవుడు, మతం గురించి ప్రస్తావించినా, శుభాకాంక్షలు చెప్పినా, అభినందనలు చెప్పినా.. అవి ఏ మతానికో కూడా తెలియనంత నిగూఢంగా, నర్మగర్భంగా చెప్పేవారు. అంతేకానీ ఇప్పటిలాగా చికెన్ తిన్నాం కాబట్టి ఎముకలు మెడలో వేసుకుని తిరగాలనే ధోరణి ఎప్పుడూ లేదు. మరి అలాంటి రాజకీయ వారసత్వం ఉన్న ఏపీలో ఇప్పుడు నేతలు ఎందుకు ఇలా తయారయ్యారనేది తేలాల్సిన ప్రశ్న. అసలు ప్రస్తుతం ఏపీ నేతలు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని, కచ్చితంగా ప్రజలు కీలెరిగి వాత పెడతారనే వాదన కూడా లేకపోలేదు.

మత రాజకీయానికి తెరలేపిన నేతలు.. ఏదో జరుగుతుందని ఆశిస్తున్నారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగినా ఆశ్చర్యం లేదనేది రాజకీయ పరిశీలకుల మాట. ఎందుకంటే ఎక్కడైనా ఓటర్ల ఆలోచనా ధోరణి ఎప్పుడూ నేతల ఊహకు అందని విధంగానే ఉంటుంది. దానికి ఏపీ కూడా మినహాయింపు కాదు. అసుల మాకు కావాల్సిందేమిటి..? వీళ్లు మాట్లాడుతున్నదేమిటి..? అనే చర్చ ఇప్పటికే ఏపీ పౌర సమాజంలో మొదలైంది. నేతలు ఎవరికి వారు పంతాలు, పట్టింపులకు పోయి మతం గురించి బహిరంగ చర్చలు పెట్టడం, ఎవరి మతం ఏమిటో తెలియాలని పట్టుబట్టడం పూర్తిగా అసందర్భ ప్రేలాపనే అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అగ్రనేతలైనా, మరే నేతలైనా వారి వ్యక్తిగతాల గురించి జనానికి అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా వారి పనితీరు ఎలా ఉందనేది మాత్రమే. దాన్ని బట్టే ప్రజలు నేతల్ని ఆదరిస్తారు. అంతేకానీ కేవలం మతం ఆధారంగా ఏ నేతకూ బ్రహ్మరథం పట్టే సంస్కృతి ఏపీలో గతంలో లేదు. ఇప్పుడు వస్తుందనుకోవటం కూడా ఒట్టి భ్రమే. ఎందుకంటే నేతల మతం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఫలానా నేత ఓ మతం వారైనంత మాత్రాన.. ఆయనకు ఓటేసేవారంతా అదే మతానికి ప్రభావితులు కావాలనే రూల్ ఎక్కడా లేదు. అలా కావడం కూడా జరగని పని. ఈ మాత్రం అవగాహన లేకుండా నేతలు ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారని జనం మాట్లాడుకుంటున్నారు.

ఇక్కడ మతం గురించిన చర్చ, రచ్చ, నేతల అనౌచిత్యం గురించి పక్కనపెడితే.. అసలు ఏపీ రాజకీయంలో ఈ పోకడలు ఎటుదారితీస్తాయోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. ఎలాంటి ఏపీ రాజకీయం ఎలా అయిపోతుందనే ఆవేదన కూడా కలుగుతోంది. విభజనతో ఆర్థికంగా నష్టపోయిన ఏపీ.. నేటి నేతల నిర్వాకంతో.. రాజకీయంగానూ దిగజారే ప్రమాదం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ఇఫ్పుడు అందరి ఆశా ఏపీ ఓటర్లపైనే ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో నేతలకు సరైన దారి ఏదో ఓటుతో చూపించిన ఏపీ ప్రజలు.. ఇప్పుడు కూడా నేటి నేతల మతపిచ్చిని తగ్గించేలా కర్రు కాల్చి వాతపెట్టాలనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటుకు తిరుగులేదు. ఏ విధానం అయినా సరే దానికి ప్రజామోదం లేదని తెలిస్తే.. ఏ పార్టీ అయినా దాన్ని చచ్చినట్టు వదిలేస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెరుగుతున్న మతపిచ్చి పీక్స్‌కు చేరకముందే మొగ్గలోనే తుంచేయాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

UPSC ಪರೀಕ್ಷೆ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟ: ಅನುಜ್​ ಅಗ್ನಿಹೋತ್ರಿ ದೇಶಕ್ಕೇ ನಂ.1

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,6,2026 (www.justkannada.in): ಕೇಂದ್ರ ಲೋಕಸೇವಾ ಸೇವಾ ಆಯೋಗದ (ಯುಪಿಎಸ್​ಸಿ) 2025ನೇ ಸಾಲಿನ...

സ്വന്തം ഊര്‍ജ ആവശ്യങ്ങള്‍ നിറവേറ്റാന്‍ ഇന്ത്യയ്ക്ക് മറ്റൊരു രാജ്യത്തിന്റെ അനുമതി എന്തിന്? സ്റ്റാലിന്‍

ചെന്നൈ: പശ്ചിമേഷ്യയില്‍ സംഘര്‍ഷം തുടരുന്ന സാഹചര്യത്തില്‍ റഷ്യയില്‍ നിന്നും എണ്ണ വാങ്ങുന്നതിനായി...

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

హిందూపూర్ స్టేషన్‌లో కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ...