టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ పనుల్లో వేగం పెంచారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ (SSMB29) కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు విదేశీ షెడ్యూల్ కోసం జార్జియాకు బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో ఆయన భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని ఆయనకు సెండాఫ్ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి.
Also Read :Mrunal Thakur: వారి కారణంగా నేను ఎడవని రాత్రి లేదు..
తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు జార్జియాలో జరగబోయే కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం మంగళవారం ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నమ్రత, సితార కూడా ఎయిర్పోర్ట్కు రాగా, వారు మహేష్కు ప్రేమగా సెండాఫ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళి చిత్రం కోసం మహేష్ బాబు తన మేకోవర్ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్న మహేష్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.





