25
February, 2026

A News 365Times Venture

25
Wednesday
February, 2026

A News 365Times Venture

Warm Water on Empty Stomach: ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా..? ప్రయోజనాలు ఏంటి..? దుష్ప్రభావాలు ఏంటి..?

Date:

Warm Water on Empty Stomach: ఈ మధ్యకాలంలో ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం చాలా మందికి అలవాటుగా మారింది. కాఫీ లేదా టీకి ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ చాలామంది దీనిని పాటిస్తున్నారు. అయితే ఇది నిజంగా జీర్ణక్రియకు సహాయపడుతుందా? లేక మరో వెల్నెస్ ట్రెండ్ మాత్రమేనా? అన్న ప్రశ్నకు శాస్త్రీయంగా సమాధానం తెలుసుకుందాం. ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రకారం, సుమారు 500 మిల్లీ లీటర్ల నీరు తాగితే జీవక్రియ రేటు 30 శాతం వరకు పెరుగుతుంది. నీటిని శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి శరీరం శక్తిని ఖర్చు చేస్తుంది. ఈ ప్రక్రియనే నీటి-ప్రేరిత థర్మోజెనిసిస్ అంటారు.

అజీర్ణం తగ్గుతుందా?
అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారిలో గోరువెచ్చని నీరు జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఇది రక్తనాళాలను విస్తరించి (వాసోడైలేషన్) పేగులకు రక్తప్రవాహాన్ని పెంచుతుంది.. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.. చల్లని నీటితో పోలిస్తే ఆహారాన్ని సులభంగా విచ్ఛిన్నం చేయడంలో తోడ్పడుతుంది.. అయితే దీని ప్రభావం వ్యక్తిని బట్టి మారవచ్చు అంటున్నారు..

ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ఐదు ముఖ్య ప్రయోజనాలు
1. జీర్ణక్రియ మెరుగుదల: గోరువెచ్చని నీరు జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేసి, అల్పాహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
2. మలబద్ధకం తగ్గింపు: వెచ్చని ద్రవాలు పేగుల కదలికలను (పెరిస్టాల్సిస్) ప్రేరేపిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
3. సహజ నిర్విషీకరణ: శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరగడంతో చెమట, మూత్రం ద్వారా విషపదార్థాలు బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది.
4. రక్త ప్రసరణ మెరుగుదల: వేడి వల్ల రక్తనాళాలు విస్తరించి, శరీరం అంతటా ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.
5. బరువు నియంత్రణకు తోడ్పాటు: నేరుగా కొవ్వును కరిగించకపోయినా, జీవక్రియ రేటు పెరగడం వల్ల అదనపు క్యాలరీలు ఖర్చవుతాయి.

ఈ వేటి నీటిని ఎంత ఉష్ణోగ్రతలో తాగాలి?
పరిశోధనల ప్రకారం: 37°C – సాధారణ గట్ చలనశీలతకు.. 50°C – 60°C – అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తగ్గించడానికి అనుకూలం.. గ్లాసును పట్టుకోలేనంత వేడిగా ఉంటే, అది త్రాగడానికి చాలా వేడిగా ఉన్నట్టే.

గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే 5 దుష్ప్రభావాలు
1. కాలిన గాయాల ప్రమాదం: 60°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీరు అన్నవాహికను దెబ్బతీయవచ్చు.
2. దంతాల ఎనామెల్ కోత: ఎప్పటికప్పుడు చాలా వేడి నీరు తాగడం వల్ల పళ్ల ఎనామెల్ బలహీనపడుతుంది.
3. GERD సమస్య పెరగడం: యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారిలో లక్షణాలు మరింత తీవ్రం కావచ్చు.
4. గొంతు చికాకు: ప్రత్యేకించి చలికాలంలో, గొంతు నొప్పి, దగ్గు సమస్యలు పెరగవచ్చు.
5. నీటి మత్తు (అరుదుగా): ఖాళీ కడుపుతో తక్కువ సమయంలో 1–2 లీటర్లకు పైగా నీరు తాగితే సోడియం స్థాయిలు తగ్గే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చూచిస్తున్నారు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಉದ್ಯೋಗಾಕಾಂಕ್ಷಿಗಳ ಪ್ರತಿಭಟನೆಗೆ ಕಳವಳ: ಭರವಸೆ ನೀಡಿದ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,24,2026 (www.justkannda.in):  ಖಾಲಿ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಆಗ್ರಹಿಸಿ ಧಾರವಾಡದಲ್ಲಿ ಉದ್ಯೋಗಾಕಾಂಕ್ಷಿಗಳು...

ബംഗാളിനോട് അവഗണന; കേരളത്തിന്റെ പേരുമാറ്റത്തില്‍ സി.പി.ഐ.എം-ബി.ജെ.പി ധാരണ: മമത

കൊല്‍ക്കത്ത: കേരളത്തിന്റെ പേരുമാറ്റത്തിന് കേന്ദ്ര മന്ത്രിസഭ അംഗീകാരം നല്‍കിയ നടപടിയെ വിമര്‍ശിച്ച്...

`சேகர்பாபு பேசினது சங்கடமா போச்சு; உடனே துணை முதல்வர்..'- தவெக மேடையில் பாடியது குறித்து வேல்முருகன்

சமீபத்தில் தவெக-வின் மூன்றாமாண்டு தொடக்க விழா மேடையில் பாடகர் வேல்முருகன் விஜய்யைப்...