14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

GST Council : దీపావళి ముందే వచ్చేసింది.. వాటిపై జీఎస్టీ రద్దు..

Date:

GST Council : పండగ పూట సామాన్యుడికి శుభవార్త! దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న 12%, 28% పన్ను శ్లాబులను పూర్తిగా రద్దు చేసి, కేవలం 5%, 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అత్యవసరమైన హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి భారీ ఊరటనిచ్చింది. విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ కొత్త, సరళమైన పన్ను విధానం ఈ నెల 22 నుంచే అమల్లోకి రానుండటంతో, దేశ ప్రజలకు దీపావళి పండగ నెల ముందే వచ్చేసినట్లయింది.

అతిపెద్ద ఊరట.. ఇన్సూరెన్స్‌పై జీఎస్టీకి గుడ్‌బై!
ఇప్పటివరకు మధ్యతరగతి ప్రజలు తమ ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ఇది చాలా మందికి భారంగా మారింది. ఈ భారాన్ని పూర్తిగా తొలగిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం కోట్లాది కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చనుంది. ఇకపై ఇన్సూరెన్స్ ప్రీమియంలు గణనీయంగా తగ్గనున్నాయి. ఆరోగ్య భద్రత, ఆర్థిక భరోసా ఇకపై మరింత అందుబాటులోకి రానున్నాయి.

ఇక చౌకగా పాలు, పన్నీరు, నెయ్యి.. నిత్యావసరాలపై పన్నుల కోత
కొత్త నిర్ణయాలతో సామాన్యుడి వంటగది బడ్జెట్ కూడా తగ్గనుంది. 12% శ్లాబును రద్దు చేయడంతో, ఆ పరిధిలో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% శ్లాబులోకి రానున్నాయి. దీంతో వాటి ధరలు దిగిరానున్నాయి.

తగ్గనున్న కొన్ని వస్తువుల ధరలు:

పాల ఉత్పత్తులు: నెయ్యి, వెన్న, చీజ్, ప్యాక్ చేసిన పన్నీరు, కండెన్స్‌డ్ మిల్క్.

డ్రై ఫ్రూట్స్ & పండ్లు: బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు, అంజీర్ వంటివి.

ఇతరాలు: పండ్ల రసాలు, సాసేజ్‌లు, చేపలు, మాంసం ఉత్పత్తులు, పాస్తా, నూడుల్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు.

ఈ మార్పులతో నెలవారీ కిరాణా సామాను బిల్లు తగ్గడం ఖాయం.

విలాసాలపై వేటు.. సామాన్యుడికి మేలు
పన్నుల విధానాన్ని సరళీకరిస్తూనే, ప్రభుత్వం విలాసవంతమైన వస్తువులపై పన్ను భారాన్ని పెంచింది. ఖరీదైన కార్లు, వాచీలు, ఇతర లగ్జరీ వస్తువులపై ఏకంగా 40% పన్ను విధించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా, సామాన్యుడిపై భారం పడకుండా పన్నుల వ్యవస్థను సమతుల్యం చేసినట్లయింది.

మొత్తం మీద, జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు పండగ సీజన్‌కు ముందు సామాన్యుడి జేబుకు భరోసానిస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న వేళ, ఈ ధరల తగ్గింపు వినియోగాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది నిజంగా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దీపావళి కానుక అనే చెప్పాలి.

Niranjan Reddy : హరీష్‌రావు పనితీరును ప్రశంసించినవారే.. ఇప్పుడు విమర్శిస్తున్నారు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.എസ് -ഇസ്രഈല്‍ ആക്രമണത്തില്‍ മൊജ്തബ ഖാംനഇക്ക് സാരമായി പരിക്കേറ്റു; അവകാശവാദവുമായി യു.എസ് പ്രതിരോധ സെക്രട്ടറി

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ പുതിയ പരമോന്നത നേതാവ് മൊജ്തബ ഖാംനഇക്ക് യു.എസ് -ഇസ്രഈല്‍ ആക്രമണത്തില്‍...

"நடிகர் ரஜினிகாந்தை யாரும் மிரட்ட முடியாது; எந்த மிரட்டலுக்கும் அவர் அடிபணிய மாட்டார்!" – ரகுபதி

புதுக்கோட்டையில் செய்தியாளர்களை சந்தித்த அமைச்சர் ரகுபதி,"நடிகர் ரஜினிகாந்தை யாரும் மிரட்ட முடியாது....

Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

క్రికెట్ ప్రపంచంలో ‘దేవుడు’గా పిలవబడే సచిన్ టెండూల్కర్ పేరు వినగానే పరుగుల...