12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పరుగులు.. నెలరోజులుగా ఇదే తంతు

Date:

Shocking : ఈ ప్రపంచంలో రోజుకో కొత్తరకమైన, విచిత్రమైన వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య శాస్త్రాన్ని, నిపుణులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసే ఈ కొత్త కేసులు ఎంతగానో కలవరపెడుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా చైనాలో చోటుచేసుకుంది. ఇది ఏ కథనమో కాదు.. నిజంగా నోటికొచ్చే నమ్మలేని వార్తే..!

పూర్వ చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న యాంగ్‌ఝౌ నగరానికి చెందిన 8 ఏళ్ల బాలిక శరీరంలో నెలరోజులుగా ఓ విచిత్రమైన సంఘటన జరుగుతోంది. ఆ చిన్నారి ఎప్పటికప్పుడు వాంతి చేస్తూ, వాటిలో జీవించి ఉన్న చిన్న చిన్న పురుగులు బయటకు వస్తుండటంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. చివరికి ఈ సంఘటన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ కథనంగా ప్రచురించింది.

ఆ బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి వాంతిలోనూ సుమారు ఒక సెంటీమీటర్ పొడవున్న, వేళ్లంత చిన్న జీవులు కనిపించాయి. స్థానిక డాక్టర్లు శరీరం పరీక్షించినా, ఈ లక్షణాలకు సరిపడే వ్యాధిని గుర్తించలేకపోయారు. చివరికి చిన్నారిని సుఝౌ విశ్వవిద్యాలయానికి చెందిన పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యురాలు డా. జాంగ్ బింగ్‌బింగ్ ఓ సంచలన నిజాన్ని వెల్లడించారు.

ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?

ఆ బాలిక వాంతుల్లో ఉన్న జీవులను పరీక్షించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ఇది ‘డ్రైన్ ఫ్లై లార్వా’ (Drain Fly Larvae) అని నిర్ధారించింది. దీన్ని “మాథ్ ఫ్లై” అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా చీకటి, తేమ ఉన్న ప్రాంతాల్లో.. ముఖ్యంగా బాత్రూంలు, చెరువులు, అండర్గ్రౌండ్ డ్రైన్లు వంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. చైనాలో వేసవిలో ఇవి విస్తృతంగా వ్యాపిస్తాయి.

ఈ విషయం తెలిసిన వెంటనే బాలిక తల్లిదండ్రులు “ఇలాంటి చిన్న జంతువులను మా ఇంట్లో చూసాం కానీ, అవి ఇంత ప్రమాదకరంగా ఉంటాయని అస్సలు ఊహించలేదు” అని వాపోయారు.

కానీ ఆ పురుగులు బాలిక శరీరంలోకి ఎలా ప్రవేశించాయో విషయానికి వస్తే, యాంగ్జౌ CDC విభాగం చీఫ్‌ జు యుహుయ్ మాట్లాడుతూ, కలుషితమైన నీటి ద్వారా పురుగులు బాలిక శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చని అన్నారు. బాలిక పళ్ళు తోముకున్నప్పుడు లేదా టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు, నీటి స్ప్రే ద్వారా పురుగులు ఆమె శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చు. ఈ లార్వా రక్తం ద్వారా వ్యాధిని వ్యాపింపజేస్తుంది.

SCMP నివేదిక ప్రకారం.. మురుగు పురుగులను ఒట్టి చేతులతో తాకకూడదు, ఎందుకంటే అవి మోసుకెళ్ళే బ్యాక్టీరియా కళ్ళు లేదా నోటి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. బదులుగా, ప్రభావిత కాలువలపై ఉప్పు, బేకింగ్ సోడా కలిపిన వేడి నీటిని పోయడం ద్వారా లార్వాలను తొలగించాలని సిఫార్సు చేయబడింది.

ఈ సంఘటన మనందరికీ కూడా ఒక హెచ్చరికే. మన ఇళ్లలో కనిపించే చిన్న కీటకాలకే అర్థం లేని వ్యాధులకు కారణమయ్యే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో అలాంటి పర్యావరణాలను శుభ్రంగా ఉంచడం ఎంత అవసరమో ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది.

Bangladesh: షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష.. అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

LPG ಸಿಲಿಂಡರ್ ಕೊರತೆ: ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿ, ವಾಕ್ಸಮರ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in): ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಸೇರಿ ದೇಶದ...

പ്രധാനമന്ത്രിയെ വിമര്‍ശിക്കുന്ന സോഷ്യല്‍ മീഡിയ പോസ്റ്റുകള്‍ക്ക് പൂട്ട്; ഉത്തരവിട്ട് കേന്ദ്രം

ന്യൂദല്‍ഹി: പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയെയോ സര്‍ക്കാരിനെയോ വിമര്‍ശിക്കുന്നതോ പരിഹസിക്കുന്നതോ ആയ സോഷ്യല്‍ മീഡിയ...

திருச்சி: "விஞ்ஞான ரீதியான ஊழலுக்கு பெயர் போனது தான் தி.மு.க!" – பிரதமர் மோடி காட்டம்

தமிழகத்திற்கு இந்த ஆண்டில் இரண்டாவது முறையாக வருகை தந்துள்ளார் பிரதமர் மோடி....