13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం..!

Date:

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉధృతంగా కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో పోటెత్తుతుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి పోయాయి. వీటితో పాటు వెలుపల కూడా భక్తులు గట్టి క్యూలైన్లలో వేచి నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కోసం ప్రస్తుతం భక్తులకు సుమారు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లో భక్తుల రద్దీతో అధికారులు భద్రతా ఏర్పాట్లు, నీటి సదుపాయాలు, అన్నప్రసాద పంపిణీ వంటి చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు.

Read Also: Asaduddin Owaisi: మోడీ, చంద్రబాబు, పవన్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!

గత 24 గంటల్లో 91,720 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 44,678 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన కానుకల మొత్తం రూ. 3.8 కోట్లుగా అధికారులు వెల్లడించారు. తిరుమల టిటిడి అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే వారు తగు రద్దీ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం సమంజసం.

Read Also: Fathers Day : నాన్నంటే అలుపెరుగని పోరాటం.. నేడే ఫాదర్స్ డే..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಇಂದು ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಕೋರ್ ಕಮಿಟಿ ಸಭೆ: ಸಂಭಾವ್ಯ ಅಭ್ಯರ್ಥಿಗಳ ಕುರಿತು ಚರ್ಚೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,13,2026 (www.justkannada.in): ಇಂದು ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಕೋರ್ ಕಮಿಟಿ ಸಭೆ...

ഇറാന്റെ വൈദ്യുതി സംവിധാനത്തെ തകര്‍ക്കുമെന്ന് ട്രംപ്; അരമണിക്കൂറിനുള്ളില്‍ മേഖലയെ മുഴുവന്‍ ഇരുട്ടിലാക്കുമെന്ന് ലാരിജാനി

ടെഹ്‌റാന്‍: ഇറാന്റെ വൈദ്യുതി സംവിധാനങ്ങളെ ആക്രമിച്ചാല്‍ അര മണിക്കൂറിനകം മേഖലയെ പൂര്‍ണമായും...

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి విషమం.. తాజా అప్‌డేట్ ఏంటంటే!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఎన్నికయ్యాడు. దాదాపు...