20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

Adilabad: ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్..

Date:

ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు వినయ్ కుమార్ ను నిన్న(గురువారం) అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

READ MORE: Maheshwar Reddy: దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చ‌ర్యతో స‌మానం..

విచారణలో వినయ్ తో పాటు రమేష్ అనే వ్యక్తి కూడా నేరం చేసినట్లు తెలిసిందని, అతనిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికే మాటలు చెప్పే వారి మాయమాటలు నమ్మవద్దని సీఐ సునీల్ సూచించారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రంగా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

MYSORE: ಹೊಸ ಜಾಹೀರಾತು ನೀತಿ ಕುರಿತು ಸಂಪಾದಕರ ಸಭೆ ಕರೆದ ಜಿಲ್ಲಾ ಪತ್ರಕರ್ತರ ಸಂಘ.

ಮೈಸೂರು, ಮಾ.೨೦,೨೦೨೬: ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಜಾರಿಗೆ ತರಲು ಉದ್ದೇಶಿಸಿರುವ...

92 സീറ്റില്‍ വനിതകള്‍ക്ക് വെറും ഒമ്പത് സീറ്റ്; കേരളത്തിലെ സ്ത്രീകളെ സഹായിക്കൂവെന്ന് രാഹുല്‍ ഗാന്ധിയോട് ഷമ മുഹമ്മദ്

കോഴിക്കോട്: നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ കോണ്‍ഗ്രസ് പ്രഖ്യാപിച്ച സ്ഥാനാര്‍ത്ഥി പട്ടികയിലെ വനിതാപ്രാതിനിധ്യത്തില്‍ അതൃപ്തി...

Industrial Diesel Price Hike: పెట్రోల్ తర్వాత షాకిచ్చిన డీజిల్.. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా...