19
March, 2026

A News 365Times Venture

19
Thursday
March, 2026

A News 365Times Venture

Coronavirus: విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు.. చుట్టుపక్కల వారందరికీ టెస్టులు!

Date:

విశాఖపట్నంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది. మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: Coronavirus: కరోనా వైరస్ పట్ల తక్షణ అప్రమత్తం.. ఆరోగ్యశాఖ సూచనలు జారీ!

పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు కొన్నిరోజులుగా ఆరోగ్యం బాలేదు. ముందుగా మలేరియా, డెంగ్యూ అని భావించిన వైద్యులు పరీక్షలు చేశారు. చివరకు కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయ డయాగ్నోస్టిక్స్ విశాఖపట్నంలో జరిపిన పరీక్షలో పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. అయితే బాధితురాలు కోలుకుంది. ఈ సాయంత్రానికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి.. వారం రోజులు పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కోవిడ్ 19 పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಉಪ ಚುನಾವಣೆ: ಅಭ್ಯರ್ಥಿ ಆಯ್ಕೆ ಬಗ್ಗೆ ಹೈಕಮಾಂಡ್ ನಿರ್ಧಾರ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in):  ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ, ಬಾಗಲಕೋಟೆ ವಿಧಾನಸಭಾ ಉಪಚುನಾವಣೆಗೆ ಅಭ್ಯರ್ಥಿ...

‘സ്ഥാനാര്‍ത്ഥിത്വം മാത്രമല്ല പ്രശ്‌നം, എന്റെ പ്രയാസം നേതൃത്വത്തെ അറിയിച്ചിട്ടുണ്ട്; ലീഗ് വിടുമെന്ന അഭ്യൂഹങ്ങളില്‍ രണ്ടത്താണി

മലപ്പുറം: മുസ്‌ലിം ലീഗ് നേതൃത്വവുമായുള്ള അതൃപ്തിയെത്തുടര്‍ന്ന് പാര്‍ട്ടി വിടുമെന്ന അഭ്യൂഹങ്ങളില്‍ പ്രതികരണവുമായി...

Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అనుకుంటున్న తరుణంలో ఇరాన్ చేసిన...