26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

CM Revanth Reddy : హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు కోసం జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

Date:

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం పునర్వినియోగం, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పునరుద్ధరణ వంటి కీలక రంగాల్లో జపాన్ ప్రముఖ సంస్థలతో లేఖా ఆఫ్ ఇంటెంట్ (LoI)పై సంతకాలు చేసుకుంది. ఈ భాగంగా, హైదరాబాద్‌లో “ఎకో టౌన్” ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కిటాక్యూషూ నగరాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు తదితరులు అక్కడి మున్సిపల్ పరిపాలన, పునరుజ్జీవన విధానాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా, ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా ఉన్న నగరంగా పేరు గాంచిన కిటాక్యూషూ ఎలా పర్యావరణ మిత్రంగా మారిందనే విషయాన్ని మేయర్ తకయూషి ప్రస్తావించారు.

CM రేవంత్ మాట్లాడుతూ, “వికాసం, ఉద్యోగావకాశాలు, సంపద సృష్టి మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ కూడా ప్రభుత్వానికి ప్రాధాన్యం. ఈ రోజు జపాన్ ప్రముఖ సంస్థలైన EX రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీ9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ లతో కలిసి పునర్వినియోగ విధానాలను తెలంగాణలో అమలు చేయడానికి ముందడుగు వేస్తున్నాం,” అని తెలిపారు.

అలాగే, కిటాక్యూషూ – హైదరాబాద్ నగరాల మధ్య “సిస్టర్ సిటీ” ఒప్పందం చేసుకోవాలనే మేయర్ తకయూషి సూచనను కూడా ముఖ్యమంత్రి సమర్థించారు. “ఇప్పటి నుంచి handshake కాదని, future generations కోసం నిర్మిస్తున్న బ్రిడ్జ్ అని భావించాలి” అని పేర్కొన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “టెలంగాణాలో పెట్టుబడి పెట్టే వారికి మేం ఫ్రెండ్లీ గవర్నమెంట్, రాబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ల్డ్ వర్క్‌ఫోర్స్, పచ్చదనం & ఇన్నోవేషన్‌కు అనుగుణంగా ఉన్న అవకాశాలను కల్పిస్తున్నాం. జపాన్ సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయం” అని వివరించారు.

జపాన్-తెలంగాణ మధ్య సంబంధాలను మరింత బలపరిచే క్రమంలో, హైదరాబాద్‌లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మరోవైపు, మేయర్ తకయూషి, “మాకు యువత అవసరం ఉంది. స్కిల్డ్ వర్కర్లు కావాలి. మీరు పంపగలరా?” అని అడిగారు.

ఇరుపక్షాలు అనేక అంశాల్లో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు, ఒక స్పష్టమైన సహకార మెకానిజం ఏర్పాటు చేయాలని భావించాయి. కిటాక్యూషూ నగరంలో మురసాకి నదిని ఎలా పునరుద్ధరించారో చూపుతూ రివర్ మ్యూజియం, రివర్ ఫ్రంట్ వాక్, రీసైక్లింగ్ ప్లాంట్‌లను తెలంగాణ ప్రతినిధులకు చూపించారు.

IPL 2025 : సగం ఐపీఎల్ అయిపోయింది భయ్య.. రికార్డులు చూద్దాం రండి..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಜನರ, ಪಕ್ಷದ ಬೆಂಬಲ ಇಲ್ಲದಿದ್ದರೇ ನಾನು 17 ಬಜೆಟ್ ಮಂಡಿಸಲು ಹೇಗೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತಿತ್ತು-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in):  ನನಗೆ ರಾಜ್ಯದ ಜನರ ಪಕ್ಷದ ಹೈಕಮಂಢ್  ಬೆಂಬಲ...

സാദിഖലി തങ്ങളെ അപകീർത്തിപ്പെടുത്തിയുള്ള ഫേസ്ബുക്ക് പോസ്റ്റ്: കാപ്പ കേസ് പ്രതി ആവശ്യപ്പെട്ടത് 15 കോടി

മലപ്പുറം: സാദിഖലി തങ്ങളെ അപകീർത്തിപ്പെടുത്തിയുള്ള ഫേസ്ബുക് പോസ്റ്റിന് പിറകിലെ ലക്ഷ്യം ബ്ലാക്ക്...

ஸ்டாலின் Vs விஜய்… பெண்கள் வாக்குகளை வளைப்பதில் தீவிரம் | ‘வாவ்’ வியூகம் 10

பெண்கள் வாக்குகளை வளைப்பதில் தீவிரம்‘வாவ்’ வியூகம் 10வாக்காளர்கள் எதிர்பார்த்த ஜனநாயகத் திருவிழா...

Mermaid: రేజర్ షార్ప్ పళ్లు, చేప తోకతో మమ్మీ.. జపాన్‌లో సగం చేప సగం మానవుడి మెర్‌మెయిడ్

జపాన్‌లోని ఫుకుషిమాలోని ఒక పాత ఇంట్లో ఒక విచిత్రమైన మమ్మీ వెలుగుచూసింది....