12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

DGP Dwaraka Tirumala Rao: డిప్యూటీ సీఎం పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ.. ఆసక్తికర కామెంట్లు..!

Date:

DGP Dwaraka Tirumala Rao: పిఠాపురంలో క్రైమ్ పెరిగిందంటూ గత వారం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆస్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడను అని స్పష్టం చేశారు.. అటువంటిది ఉంటే అడ్రస్ చేస్తామని వెల్లడించారు.. అయితే, సైబర్ క్రైమ్‌ పెరిగింది.. విజిబుల్, ఇమేజింగ్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.. మెన్‌లతో కాకుండా డ్రోన్ ల ద్వారా కూడా ఫోకస్ పెడతాం.. ఏఐ ద్వారా కేసులు పరిష్కారం చేస్తాం అన్నారు. మరోవైపు.. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలని కట్టడి చేస్తున్నాం.. సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ అయిపోయాయి.. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను ఆరు నెలల్లో పరిష్కారం చేశాం.. టెక్నాలజీ ఉపయోగించి కేసులు పరిష్కారం చేస్తాం అన్నారు.

Read Also: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవ్ కి రివార్డు ఎంతంటే?

మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇంటిపై డ్రోన్ ఎగురవేసిన ఘటనపై విచారణ కొనసాగుతుంది. నిన్న సాయంత్రానికే విచారణ పూర్తి కావాల్సింది. మరో రోజు అదనంగా విచారణకు సమయం కోరారన రాజమహేంద్రవరం పర్యటనలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేసిన విషయం విదితమే.. విజయనగరం జిల్లా ఏజెన్సీలో పవన్ కల్యాణ్‌ పర్యటనలో నకిలీ పోలీసు అధికారి, ఇంటిపై డ్రోన్ ఘటనలను వేరువేరుగా చూస్తున్నాం అన్నారు.. ఇక, గతం కంటే ఈసారి సంక్రాంతికి కోడి పందాలు ఎక్కువగా జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. కోడి పందాలకు సంబంధించి కేసులు అయితే ఎక్కువగానే నమోదు చేశామని డీజీపీ ద్వారకా తిరుమలరావు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

LPG ಸಿಲಿಂಡರ್ ಕೊರತೆ: ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿ, ವಾಕ್ಸಮರ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in): ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಸೇರಿ ದೇಶದ...

പ്രധാനമന്ത്രിയെ വിമര്‍ശിക്കുന്ന സോഷ്യല്‍ മീഡിയ പോസ്റ്റുകള്‍ക്ക് പൂട്ട്; ഉത്തരവിട്ട് കേന്ദ്രം

ന്യൂദല്‍ഹി: പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയെയോ സര്‍ക്കാരിനെയോ വിമര്‍ശിക്കുന്നതോ പരിഹസിക്കുന്നതോ ആയ സോഷ്യല്‍ മീഡിയ...

திருச்சி: "விஞ்ஞான ரீதியான ஊழலுக்கு பெயர் போனது தான் தி.மு.க!" – பிரதமர் மோடி காட்டம்

தமிழகத்திற்கு இந்த ஆண்டில் இரண்டாவது முறையாக வருகை தந்துள்ளார் பிரதமர் மோடி....