14
July, 2026

A News 365Times Venture

14
Tuesday
July, 2026

A News 365Times Venture

Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’

Date:

Vijayashanthi: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘోర హత్యాకాండపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి సోషల్ మీడియా (ఫేస్‌బుక్) వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడు జైల్లో ఆత్మహత్య చేసుకోవడంతో కేసు ముగిసిపోయిందని పోలీసులు భావించడం సరికాదని ఆమె హితవు పలికారు. గతంలోనే ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో (POCSO) కేసులో అరెస్టయిన నిందితుడు రాజ్‌కుమార్.. అంత సులభంగా బెయిల్‌పై బయటకు రావడానికి స్థానిక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. నిందితుడి వద్ద నుంచి లంచం తీసుకుని, కేసును నీరుగార్చి అతని విడుదలకు పోలీసులు సహకరించారనే వార్తలు పత్రికల ద్వారా తెలుసుకుని తెలంగాణలోని మహిళా లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రక్షించాల్సిన పోలీసులే చేసిన ఈ ఘోరమైన తప్పు వల్లే.. ఒకే కుటుంబానికి చెందిన అమాయకుల ప్రాణాలు దారుణంగా బలికావడానికి ఆస్కారం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆమె పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఉన్న ఇలాంటి లోపాలు, అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రతపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మహిళలకు పెద్దపీట వేస్తామని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాబాద్ నరమేధాన్ని, దీని వెనుక ఉన్న పోలీస్ వైఫల్యాలను అత్యంత సీరియస్‌గా పరిగణించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడకుండా, బాధ్యులైన అధికారులపై కఠినంగా వ్యవహరించాలని ఒక మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. హర హర మహాదేవ్, జై తెలంగాణ అని రాసి ఉన్న పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Vijayashanthi1

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യുവതിക്കെതിരായ അധിക്ഷേപം; തൊപ്പി ഗാങ് അംഗം മമ്മു അറസ്റ്റില്‍; നടപടി ഹനാന്‍ ഷായുടെ സുഹൃത്തിന്റെ ഭാര്യയുടെ പരാതിയില്‍

മലപ്പുറം: തൊപ്പി എന്ന പേരിലറിയപ്പെടുന്ന യൂട്യൂബര്‍ നിഹാദിന്റെ സംഘാംഗമായ മുഹമ്മദ് എന്ന...

லாக்கப் மரணம்: 'அடித்தே கொன்ற காவல்துறையினரைப் முதல்வர் விஜய் பாதுகாக்கிறாரா?'- சீமான் கண்டனம்

நாகர்கோவிலில் குட்கா வழக்கில் கைதுசெய்து சிறையிலடைக்கப்பட்ட சபரிவர்மன் என்ற மாற்றுத்திறனாளி நீதிமன்றக்...

ಅತಿಥಿ ಉಪನ್ಯಾಸಕರ ಆಯ್ಕೆ: ಆನ್‌ ಲೈನ್ ಮೂಲಕ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ

ಬೆಂಗಳೂರು, ಜುಲೈ ‌13, 2026 (www.justkannada.in) : ಕಾಲೇಜು ಶಿಕ್ಷಣ...

ഒന്നാം റാങ്കുകാര്‍ക്ക് പോലും നിയമനമില്ല; മണ്ണ് വാരിത്തിന്ന് പ്രതിഷേധിച്ച് എല്‍.പി.എസ്.ടി റാങ്ക് ഹോള്‍ഡര്‍മാര്‍

തിരുവനന്തപുരം: എല്‍.പി. സ്‌കൂള്‍ ടീച്ചര്‍ (എല്‍.പി.എസ്.ടി) പി.എസ്.സി റാങ്ക് ലിസ്റ്റിലുള്ളവര്‍ സെക്രട്ടറിയേറ്റിന്...