టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా తన ప్రతాపం చూపించడానికి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘లుఖ్కే’ మే 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. హిమాంక్ గౌర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, పంజాబ్ బ్యాక్డ్రాప్లో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసే ఒక ఇంటెన్స్ పోలీస్ డ్రామాగా రూపొందింది. ఈ సిరీస్లో రాశీ ఖన్నాతో పాటు పాలక్ తివారీ కూడా ఒక కీలక పాత్రలో మెరవబోతోంది.
అయితే ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రాశీ తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. ‘ఈ సిరీస్లో నేను ‘గుర్బానీ’ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తా. ఇప్పటికి ఎన్నో భాషల్లో సినిమాలు చేసినప్పటికీ, పంజాబీ నా అస్తిత్వం, ఈ పాత్ర కూడా పంజాబీ మూలాలు ఉన్నది కావడంతో నాకు ఇది చాలా ప్రత్యేకమైంది. గుర్బానీ పాత్రలో నటించడం నా సొంత ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతిని ఇచ్చింది’ అని రాశీ ఎమోషనల్ అయ్యింది.
కథలో గుర్బానీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్, భిన్నమైన కోణాలు దాగి ఉంటాయని రాశీ వివరించింది. పూర్తి భిన్నమైన కథాంశంతో రూపొందిన ‘లుఖ్కే’లో భాగం కావడం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన పోరాటాన్ని చూడాలంటే మే 8 వరకు వేచి చూడాల్సిందే.





