AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. వేసవి సెలవుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. బీసీల సామాజిక స్థితిగతులపై జరుగుతున్న సర్వే పూర్తి అయ్యేందుకు మరో నెల రోజుల సమయం పట్టవచ్చని హైకోర్టుకు ఏజీ చెప్పారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు సర్వే నిర్వహిస్తున్నారని కోర్టుకు ఏజీ తెలిపారు. సర్వే వివరాలను పరిగణలోనికి తీసుకొని స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ఏకసభ్య కమిషన్ నిర్ణయిస్తుందని ఏజీ కోర్టుకు నివేదించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. తదుపరి విచారణ జులై మొదటి వారానికి వాయిదా వేసింది. మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
Date:





