బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం నేటితో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ మార్కును అందుకోబోతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం మాములు విషయం కాదని ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
Also Read : Dhurandhar : The Revenge : తెలుగు రాష్ట్రాల్లో ధురందర్ దండయాత్ర.. టికెట్టు ముక్క లేదు
భారతీయ సినిమాలో ఇప్పటివరకు కేవలం మూడు చిత్రాలు మాత్రమే విడుదలైన 3 రోజుల్లోనే బాహుబలి 2, పుష్ప 2 సినిమాలు రూ. 500 కోట్ల మార్కును దాటగలిగాయి. ఇప్పుడు ధురంధర్: ది రివెంజ్ ఆ మార్క్ ని టచ్ చేసింది. విశేషమేమిటంటే ఈ మూడు చిత్రాలు కూడా సీక్వెల్స్ కావడం గమనార్హం. ఒక ఫ్రాంచైజీకి ఉన్న పవర్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో ఈ విజయాలు నిరూపిస్తున్నాయి. ‘ధురంధర్ 2’ సాధించిన ఈ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ సినిమాకు మిడిల్ ఈస్ట్ (గల్ఫ్ దేశాల్లో) విడుదల లేదు, అలాగే ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ అయినా మూడు రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. అయినప్పటికీ, కేవలం హిందీ వెర్షన్ మరియు పరిమిత అంతర్జాతీయ మార్కెట్తోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. గతంలో ‘సలార్’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 200 కోట్లు సాధించి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ‘ధురంధర్ 2’ గ్లోబల్ మార్కెట్లో రూ. 500 కోట్లతో ఆ రికార్డులను అధిగమించింది. నేడు ఆదివారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రూ. 77 కోట్లకు పైగా వసూలు చేసింది. డబ్బింగ్ వెర్షన్లు కూడా తోడవడంతో, ఈ వారాంతం ముగిసేసరికి సినిమా వసూళ్లు ఊహించని స్థాయికి చేరుకోనున్నాయి. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఇదే జోరు కొనసాగితే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఈ సినిమాకు పెద్ద కష్టమేమీ కాదు.





