LPG crisis: మిడిల్ ఈస్ట్ యుద్ధం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ వంటిళ్లు, రెస్టారెంట్-హోటళ్లలో ‘‘ఎల్పీజీ మంటలు’’ చెలరేగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సమస్య ఏర్పడుతోంది. ముఖ్యంగా, గృహ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. మరోవైపు, కమర్షియల్ వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
Read Also: House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..
హోటళ్లు, రెస్టారెంట్లు, కిచెన్స్ మూతపడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇదే సమస్య ఉంది. దీంతో.. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫారమ్స్ వ్యాపారం దెబ్బతింది. వీటినే నమ్ముకున్న గిగ్ వర్కర్ల పరిస్థితి ఘోరంగా ఉంది. గ్యాస్ సంక్షోభంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు తగ్గాయి. దీంతో దీనిని ఉపాధిగా నమ్ముకున్న వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “మా సభ్యులు ఆకలితో అలమటిస్తున్నారు” అని గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) ఒక ప్రకటనలో తెలిపింది, “ప్రస్తుత సంక్షోభం విపత్తుగా మారుతోంది” అని కూడా హెచ్చరిస్తోంది. 50-60 శాతం ఫుడ్ డెలివరీలు తగ్గినట్లు తెలుస్తోంది.





