10
March, 2026

A News 365Times Venture

10
Tuesday
March, 2026

A News 365Times Venture

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 22వ విడత రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే ఖాతాల్లోకి

Date:

దేశంలోని అన్నదాతలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ. 6 వేలు నేరుగా ఖాతాల్లో జమచేస్తుంది. ఇప్పటికే 21 విడతలు విడుదల కాగా 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రైతులకు తీపికబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ 22వ విడత తేదీని మంగళవారం ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 13న గౌహతి పర్యటన సందర్భంగా 22వ విడత పీఎం కిసాన్‌ను విడుదల చేయనున్నారు.

Also Read:Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు సుమారు రూ.19,000 కోట్లు విడుదల చేయనున్నారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఈ సమాచారాన్ని అందించారు. ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని అస్సాంలోని గౌహతిలో నిర్వహిస్తారు.

Also Read:LPG Shortage: హోటళ్లకు గ్యాస్‌ కొరత.. మెనూ మార్చేసిన హోటళ్లు.. వాటికే పరిమితం..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN)ను ప్రారంభించింది. ఈ పథకం కింద, దేశంలోని అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ రూ. 6,000 రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతలుగా పంపిణీ చేస్తోంది. PM-KISAN వాయిదాలు సాధారణంగా ఫిబ్రవరి-మార్చి, జూన్-జూలై, అక్టోబర్‌లలో విడుదల చేయబడతాయని గమనించాలి. ఈ పథకం ప్రాథమిక లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం, ఖర్చులను తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೃಷಿ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ AI ಬಳಕೆ ಅಗತ್ಯ : ವಿಟಿಯು ಕುಲಪತಿ ಎಸ್. ವಿದ್ಯಾಶಂಕರ್

  ಮೈಸೂರು, ಮಾ.೧೦,೨೦೨೬ : ಕೃಷಿ ಸೇರಿದಂತೆ ವಿವಿಧ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಕೃತಕ...

പെന്തക്കോസ്ത് സഭകളെ ക്രൈസ്തവ സഭാ വിഭാഗമായി അംഗീകരിക്കും

തിരുവനന്തപുരം: പെന്തക്കോസ്ത് സഭകളെ ക്രൈസ്തവ സഭാ വിഭാഗമായി അംഗീകരിക്കാന്‍ മന്ത്രിസഭാ യോഗത്തില്‍...

"போர் தொடர்ந்தால் உலகளாவிய எண்ணெய் சந்தைக்கு பேரழிவு ஏற்படும்" – எச்சரிக்கும் சவுதி அராம்கோ CEO

ஈரான், இஸ்ரேல், அமெரிக்கா இடையேயான போர் சூழல் காரணமாக ஹார்முஸ் ஜலசந்தி...