7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

Date:

మన వంటగదిలో బియ్యం, గోధుమ పిండి ఎప్పుడూ ఉంటాయి కదా.. చపాతీలు, రొట్టెలు, పూరీలు రోజూ ఉపయోగిస్తాం. కానీ ఒక్కసారి పిండికి పురుగులు పడితే సమస్యే.. తెల్లటి చిన్న పురుగులు (వీవిల్స్ అంటారు) కనిపిస్తాయి, పిండి వాసన వస్తుంది, పాడైపోతుంది. పురుగు పట్టిన పిండితో చేసిన రొట్టెలు తినడానికి కూడా మనసు రాదు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా అరికట్టాలో చూద్దాం.

పిండిలో పురుగులు రావడానికి ప్రధాన కారణం ఏంటి?
పిండికి పురుగులు పడటానికి అతి పెద్ద కారణం తేమ. వాతావరణం మారినప్పుడు – ముఖ్యంగా చలికాలం నుంచి వేసవికి, లేదా వర్షాకాలంలో – గాలిలో తేమ ఎక్కువవుతుంది. ఈ తేమ వల్ల పురుగులు, వాటి గుడ్లు సులభంగా పెరిగిపోతాయి. చల్లదనం కోసం పురుగులు పిండి వైపు ఆకర్షితమవుతాయి. ఇలాంటి సమయాల్లో పిండి త్వరగా పురుగు పట్టే అవకాశం ఎక్కువ.

Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

పురుగుల్ని తొలగించడానికి సులభమైన సహజ మార్గాలు
ముందుగా తేమను తొలగించడం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి పిండిని వెడల్పాటి పాత్రలో పలుచగా పరచి, 2-3 గంటలు ఎండలో పెట్టండి. సూర్యరశ్మి తేమను పూర్తిగా ఆరబెడుతుంది, పురుగులు బయటకు పారిపోతాయి లేదా చనిపోతాయి. పురుగులు కనిపించగానే

వెంటనే ఈ పద్ధతి ట్రై చేయండి – చాలా ఎఫెక్టివ్!

పురుగులు, వాటి గుడ్లు పూర్తిగా తొలగాలంటే సన్నని రంధ్రాల జల్లెడతో పిండిని జల్లండి. ఇది కొంచెం టైమ్ తీసుకుంటుంది కానీ పిండి శుభ్రంగా వస్తుంది. పిండిని నిల్వ చేసే డబ్బాలో కొన్ని బిర్యానీ ఆకులు (తెజ్ పత్తా) లేదా 2-3 ఎండు మిరపకాయలు వేయండి. వాటి ఘాటు వాసనకు పురుగులు దూరంగా ఉంటాయి. అలాగే, పిండిని ఎయిర్‌టైట్ కవర్‌లో పెట్టి 4-5 గంటలు ఫ్రిజ్‌లో ఉంచితే చల్లదనానికి పురుగులు, గుడ్లు చనిపోతాయి.

IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!

పురుగులు మళ్లీ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

పిండి డబ్బాలో 8-10 లవంగాల్ని అక్కడక్కడ వేయండి. లవంగంలో ఉండే యాంటీ-బాక్టీరియల్ గుణాలు పురుగుల్ని దూరంగా ఉంచుతాయి. బాగా ఎండిన వేపాకుల్ని చిన్న గుడ్డలో కట్టి పిండి మధ్యలో పెట్టండి.. పురుగులు అస్సలు రావు.. కొంచెం కల్లు ఉప్పును చిన్న గుడ్డలో కట్టి డబ్బాలో పెట్టండి. ఇది తేమను పీల్చుకుంటుంది, పురుగులు పట్టే అవకాశం తగ్గుతుంది. పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని 4-5 పిండిలో వేస్తే దాని వాసన కూడా పురుగులకు నచ్చదు.

ఇకపై పురుగులు రాకుండా జాగ్రత్తలు
పిండిని ఎప్పుడూ గాలి రాకుండా మూసే ఎయిర్‌టైట్ డబ్బాల్లోనే నిల్వ చేయండి. ఒకేసారి చాలా ఎక్కువ మొత్తంలో పిండి కొనకండి – తక్కువగా తీసుకొని త్వరగా ఉపయోగించండి. పాత పిండి ఎక్కువ కాలం ఉంచకండి, ఎందుకంటే పాతది త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

UPSC ಪರೀಕ್ಷೆ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟ: ಅನುಜ್​ ಅಗ್ನಿಹೋತ್ರಿ ದೇಶಕ್ಕೇ ನಂ.1

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,6,2026 (www.justkannada.in): ಕೇಂದ್ರ ಲೋಕಸೇವಾ ಸೇವಾ ಆಯೋಗದ (ಯುಪಿಎಸ್​ಸಿ) 2025ನೇ ಸಾಲಿನ...

സ്വന്തം ഊര്‍ജ ആവശ്യങ്ങള്‍ നിറവേറ്റാന്‍ ഇന്ത്യയ്ക്ക് മറ്റൊരു രാജ്യത്തിന്റെ അനുമതി എന്തിന്? സ്റ്റാലിന്‍

ചെന്നൈ: പശ്ചിമേഷ്യയില്‍ സംഘര്‍ഷം തുടരുന്ന സാഹചര്യത്തില്‍ റഷ്യയില്‍ നിന്നും എണ്ണ വാങ്ങുന്നതിനായി...

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

హిందూపూర్ స్టేషన్‌లో కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ...