7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

Stock Market Crash: యుద్ధ భయంతో కుప్పకూలిన సూచీలు! లక్ష కోట్లు ఆవిరి..

Date:

Stock Market Crash: మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజులోనే రూ.1 లక్ష కోట్లకు పైగా హరించుకుపోయింది.

READ ALSO: Blue Sparrow: ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణం ‘బ్లూ స్పారో క్షిపణి’.. దీని ప్రత్యేకత ఇదే..

కీలక గణాంకాలు..
సెన్సెక్స్: 1,097 పాయింట్లు (1.37%) కోల్పోయి 78,918.90 వద్ద ముగిసింది.

నిఫ్టీ: 315.45 పాయింట్లు (1.27%) పడిపోయి 24,450.45 వద్ద స్థిరపడింది.

మార్కెట్ క్యాప్: బీఎస్‌ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.453 లక్షల కోట్ల నుంచి రూ.452 లక్షల కోట్లకు పడిపోయింది.

బ్యాంకింగ్ డౌన్.. డిఫెన్స్ అప్!
మార్కెట్ పతనానికి ప్రధానంగా బ్యాంకింగ్ రంగం కారణం కాగా, యుద్ధ వాతావరణం నేపథ్యంలో రక్షణ (Defense) రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు: నిఫ్టీ బ్యాంక్ (2.15%), రియల్టీ (2.09%), పీఎస్‌యూ బ్యాంక్ (2.01%), ఆటో (1.06%), కన్జమ్ప్షన్ (1.02%).

లాభపడిన షేర్లు: యుద్ధ పరిస్థితుల వల్ల నిఫ్టీ ఇండియా డిఫెన్స్ 2.77% పుంజుకుంది. ఎనర్జీ (0.13%), ఐటీ (0.04%) రంగాలు స్వల్ప లాభాలను గడించాయి.

ఈ రోజు మార్కెట్లో లాభపడిన, నష్టపోయిన షేర్లు..
లాభపడిన షేర్లు (Gainers): బీఈఎల్ (BEL), సన్ ఫార్మా, ఎన్టీపీసీ (NTPC), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్.

నష్టపోయిన షేర్లు (Losers): ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ (SBI), అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్ మరియు హెచ్‌యూఎల్ (HUL).

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు:
* యుద్ధ మేఘాలు: ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. యుద్ధం ముదిరితే ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయం మార్కెట్‌లో నెలకొంది.

* భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్: యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $84, డబ్ల్యూటీఐ క్రూడ్ $80 దాటడం భారత మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.

* ఎఫ్ఐఐ (FII) అమ్మకాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే వీరు రూ.3,752.52 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

READ ALSO: Anuj Agnihotri: యూపీఎస్సీ 2025 టాపర్‌గా నిలిచిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి! ప్రస్థానం ఇదే..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

UPSC ಪರೀಕ್ಷೆ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟ: ಅನುಜ್​ ಅಗ್ನಿಹೋತ್ರಿ ದೇಶಕ್ಕೇ ನಂ.1

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,6,2026 (www.justkannada.in): ಕೇಂದ್ರ ಲೋಕಸೇವಾ ಸೇವಾ ಆಯೋಗದ (ಯುಪಿಎಸ್​ಸಿ) 2025ನೇ ಸಾಲಿನ...

സ്വന്തം ഊര്‍ജ ആവശ്യങ്ങള്‍ നിറവേറ്റാന്‍ ഇന്ത്യയ്ക്ക് മറ്റൊരു രാജ്യത്തിന്റെ അനുമതി എന്തിന്? സ്റ്റാലിന്‍

ചെന്നൈ: പശ്ചിമേഷ്യയില്‍ സംഘര്‍ഷം തുടരുന്ന സാഹചര്യത്തില്‍ റഷ്യയില്‍ നിന്നും എണ്ണ വാങ്ങുന്നതിനായി...

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

హిందూపూర్ స్టేషన్‌లో కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ...