యువసామ్రాట్ నాగచైతన్య నటించిన లేటెస్ట్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma) ఫస్ట్ గ్లింప్స్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ ఈ సినిమా జర్నీలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడు కార్తీక్ దండుపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read : Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్..
‘ఈ సినిమా స్క్రిప్ట్ మొదటిసారి విన్నప్పుడు నాకు చాలా సందేహాలు కలిగాయి. అసలు ఇలాంటి ప్రపంచాన్ని మన వెండితెరపై ఆవిష్కరించడం సాధ్యమేనా? ఆ విజువల్స్ ఎలా ఉంటాయి? అని కార్తీక్ దండును ఎన్నో ప్రశ్నలు అడిగాను. కానీ, ఈరోజు గ్లింప్స్ చూశాక నాకు అర్థమైంది.. కార్తీక్ ఒక అద్భుతమైన విజనరీ అని. ఆయన గురించి నేను జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాను’ అని చైతన్య ఎమోషనల్ అయ్యారు. ‘విరూపాక్ష’ తర్వాత కార్తీక్ దండు మరో స్థాయికి చేరుకుంటారని, చైతూ మాటల్లో స్పష్టంగా తెలిసింది. చైతన్య తన కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదని, ఈ సినిమా ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. గ్లింప్స్లో చైతూ ఇంటెన్స్ లుక్ చూసి ఇప్పటికే ఫిదా అయిన ఫ్యాన్స్, ఆయన స్పీచ్తో సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ హైలైట్గా నిలవనుంది.





