మధ్యప్రాచ్య యుద్ధ భయాందోళనలతో స్టాక్ మార్కెట్ కుదేల్ అయింది. ఉదయం నుంచే మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. చమురు ధరల పెరుగుదలతో మన మార్కెట్ ఢమాల్ అయింది. సూచీలు దారుణంగా పతనం అయ్యాయి. చివరి దాకా అలానే కొనసాగి ముగిసింది. సెన్సెక్స్ 1,048 పాయింట్లు పతనం అయి 80, 238 దగ్గర ముగియగా.. నిఫ్టీ 312 పాయింట్లు పతనం అయి 24, 865 దగ్గర ముగిసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.
నిఫ్టీలో అత్యధికంగా ఎల్ అండ్ టి, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నష్టపోగా.. భారత్ ఎలక్ట్రానిక్స్, సన్ ఫార్మా, ఒఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో లాభాలో ముగిశాయి. లోహాలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 2 శాతం చొప్పున క్షీణించాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5 శాతం చొప్పున పడిపోయాయి.





