Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. కేరళను తప్పుగా చూపించారనే వివాదం నేపథ్యంలో నిన్న కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే విధించారు. అయితే, ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత, సినమా నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఈ రోజు రాత్రి విడుదల అవుతుందని వెల్లడించారు.
Read Also: Arvind Kejriwal: ‘‘మోడీ, అమిత్ షా నాపై కుట్ర చేశారు’’.. కేజ్రీవాల్ ఆరోపణలు..
నిన్నటి రోజు సినిమా విడుదలపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ది కేరళ స్టోరీ 2 నిర్మాత విపుల్ అమృత్లాల్ షా దాఖలు చేసిన అప్పీలుపై డివిజన్ బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసిన ఒక రోజు తర్వాత కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి సర్టిఫికేషన్ పొందినప్పటికీ, సింగిల్ బెంచ్ జడ్జి సినిమా విడుదలపై 15 రోజుల తాత్కాలిక స్టే విధించారు. ఇప్పుడు ఈ స్టేను హైకోర్టు ఎత్తేసింది.
కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించి, సన్షైన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో విపుల్ అమృత్లాల్ షా కేరళ స్టోరీ 2ను నిర్మించారు. ఇటీవల, సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇది వివాదాస్పదంగా మారింది. ఒక అమ్మాయికి బలవంతంగా గొడ్డు మాంసాన్ని తినిపిస్తున్న సన్నివేశంపై పలువురు అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా, కేరళ నుంచి అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. కేరళ సీఎం పినరయి విజయ్ మాట్లాడుతూ.. కేరళ ప్రజల్ని తప్పుగా చూపిస్తున్నారని మండిపడ్డారు.





