18
February, 2026

A News 365Times Venture

18
Wednesday
February, 2026

A News 365Times Venture

Epstein Files: ఎప్‌స్టీన్ భవనంలో అమ్మాయిలతో నోబెల్ సైంటిస్ట్.. ఆయన ఆవిష్కరణ వైద్యశాస్త్రంలోనే అద్భుతం..

Date:

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క అమెరికానే కాకుండా యావత్ ప్రపంచంలో ఈ ఫైల్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రఖ్యాత నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త ఉండటం సంచలనంగా మారింది. ఎప్‌స్టీన్ భవనంలో అమెరికా సైంటిస్ట్ జేమ్స్ వాట్సన్ ముగ్గురు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటోను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. లైంగిక నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొని, జైలులోనే ఆత్మహత్యకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఉదంతంలో అనేక మంది రాజకీయ నాయకులు, అమెరికా ఎలైట్ వర్గానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ వంటి వారి పేర్లు ఉన్నాయి.

Read Also: Mohsin Naqvi: “మేము భారత్‌తో ఆడటానికి కారణం ఆయనే”.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..

తాజాగా విడుదలైన ఫైల్స్‌లో జేమ్స్ వాట్సన్ ఉండటం మరో సంచలనం. ఆయన సాధారణ శాస్త్రవేత్త కాదు, వైద్యశాస్త్రంలోనే అద్భుతమైన పరిశోధన చేశారు. 1953లో ఫ్రాన్సిస్ క్రిక్‌తో కలిసి DNA డబుల్ హెలిక్స్ నిర్మాణంను కనుగొన్నారు.ఈ ఆవిష్కరణ జన్యుశాస్త్రంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఈ ఆవిష్కరణకు గానూ 1962లో ఆయనకు నోబెల్ మెడిసిన్ పురస్కారం లభించింది. జేమ్స్ వాట్సన్ 2025లో 97 ఏళ్ల వయసులో మరణించారు.

తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫోటోల్లో వాట్సన్ ఎప్‌స్ట్రీన్ భవనంలో ఉన్నారు. ఆయనతో పాటు ముగ్గురు యువతులు ఉన్నారు. వీరి ముఖాలను బ్లర్ చేశారు. అయితే, ఈ ఫోటో ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేదు. దీనిని 2010లలో తీయవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో ఎప్‌స్టీన్ మైనర్ బాలికపై వేధింపుల కేసులో జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. ఎప్‌స్టీన్‌కు జన్యుశాస్త్రంలో మంచి ఆసక్తి ఉండేదని, ఇదే వాట్సన్‌ను కలిసేలా చేసిందనే వార్తలు ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರಂಗಕರ್ಮಿ ಪ್ರಕಾಶ್ ಬೆಳವಾಡಿಗೆ ಎಸ್.ಎಲ್ ಭೈರಪ್ಪ ಸಾಹಿತ್ಯ ಪ್ರತಿಷ್ಠಾನ ಪ್ರಶಸ್ತಿ: ಫೆ.21 ರಂದು ಪ್ರದಾನ.

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,18,2026 (www.justkannada.in): ಹೆಸರಾಂತ ರಂಗಕರ್ಮಿ ನಟ, ನಿರ್ದೇಶಕ ಮತ್ತು ಬರಹಗಾರ...

സമാധാന ചര്‍ച്ച റഷ്യ വലിച്ചുനീട്ടുകയാണെന്ന് ഉക്രൈന്‍; ബുദ്ധിമുട്ടേറിയതെന്ന് റഷ്യ; യു.എസിന്റെ മധ്യസ്ഥ ചര്‍ച്ച വീണ്ടും പൊളിഞ്ഞു

ജനീവ: സ്വിറ്റ്‌സര്‍ലന്റില്‍ യു.എസ് മധ്യസ്ഥതയില്‍ നടന്ന ഏറ്റവും ഒടുവിലത്തെ സമാധാന ചര്‍ച്ചയും...

கேரளா: தலைநகர் தொகுதிகளை குறிவைக்கும் பா.ஜ.க தலைவர்கள் – என்.டி.ஏ கூட்டணியில் களேபரம்!

கேரள மாநிலத்தில் சட்டசபை தேர்தல் நடக்க உள்ள நிலையில் சி.பி.எம் தலைமையிலான...

PM Modi: ఒకే రోజు 9 ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోడీ..

PM Modi: భారత్-యూరప్ మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం...