11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

Sergio Gor: ఢిల్లీలో గ్రాండ్‌గా అమెరికా రాయబారి విందు.. హాజరైన రాజకీయ ప్రముఖులు

Date:

అమెరికా రాయబారి సెర్గియో గోర్ దేశ రాజధాని ఢిల్లీలో గ్రాండ్‌గా పార్టీ నిర్వహించారు. ఈ విందుకు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 75 దేశాలకు చెందిన రాయబారులు పాల్గొన్నారు.

ఈ మధ్య భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ప్రధాని మోడీ-అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తన నివాసంలో సెర్గియో గోర్ విందు ఇచ్చారు. ఈ విందుకు కేంద్రమంత్రులు పియూష్ గోయల్, జైశంకర్, బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్ పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సెర్గియో గోర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘ఈరాత్రి నేను భారతదేశంలో ప్రియమైన స్నేహితులు, దౌత్య సమాజం, వ్యాపార, రాజకీయ నాయకులు, యునైటెడ్ స్టేట్స్ భాగస్వాములతో కలిసి ఇంట్లో అద్భుతమైన రిసెప్షన్‌ నిర్వహించాను. దేశాల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం, లోతైన వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్నాయి.’’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా రాయబారులకు పియూష్ గోయల్, జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Maithili Thakur: అసెంబ్లీలో మైథిలి ఠాకూర్ తొలి స్పీచ్.. ప్రశ్నలతో మంత్రిని ఇరకాటంలో పెట్టిన గాయని

అంతకుముందు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో సెర్గియో గోర్ సంభాషించారు. ‘‘ఇది అద్భుతమైన సమావేశం. మీతో కలిసి పనిచేయడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నాను.’’ అని గోర్ రాశారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ, సరఫరా గొలుసులను బలోపేతం చేయడంపై చర్చించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో అమెరికా నుంచి బలమైన భాగస్వామ్యం ఉంటుందని.. దేశాల మధ్య సంబంధాలు మరింత పెంచుతుందని అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಜಾಮೀನು ಅರ್ಜಿ ವಜಾಗೊಳಿಸಿದ ಹೈಕೋರ್ಟ್: ಬಿಜೆಪಿ ಶಾಸಕನಿಗೆ ಬಂಧನದ ಭೀತಿ

ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ,10,2026 (www.justkannada.in): ರೌಡಿಶೀಟರ್ ಬಿಕ್ಲು ಶಿವು ಕೊಲೆ ಪ್ರಕರಣಕ್ಕೆ...

ബാബരി ഒരിക്കലും പുനര്‍നിര്‍മിക്കപ്പെടില്ല, ഖിയാമത്ത് നാള്‍ ഒരിക്കലും വരില്ല: യോഗി ആദിത്യനാഥ്

ലഖ്‌നൗ: ലോകാവസാനം വരെ ബാബരി മസ്ജിദ് പുനര്‍നിര്‍മിക്കപ്പെടില്ലെന്ന് ഉത്തര്‍പ്രദേശ് മുഖ്യമന്ത്രി യോഗി...

தவெக: 'வேட்பாளரை இப்படித்தான் தேர்வு பண்ணப் போறோம்' – ஆனந்த் போட்ட கண்டிஷன்; அப்செட்டில் மா.செக்கள்?

விருப்ப மனு விநியோகம் ஆன்லைன் மூலமாக நடந்து கொண்டிருக்கும் நிலையில், திடீரென...

Team India: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు బిగ్‌ షాక్.. ఆసుపత్రిలో చేరిన విధ్వంసకర బ్యాట్స్ మెన్

Team India: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై అనిశ్చితి ముగిసింది. హై డ్రామాకు తెరలేపిన...