26
April, 2026

A News 365Times Venture

26
Sunday
April, 2026

A News 365Times Venture

Fraud : 500 కోట్ల షెల్ కంపెనీల మోసం.. హైదరాబాద్ లో సంచలనం!

Date:

Fraud : భర్త శ్రీధర్‌తోపాటు తమ్ముడు ఎమర్తి రామ్‌దాస్ సహకారం డబ్బు నిజాయితీగా సంపాదించాలంటే కష్టం.. కానీ మోసం చేసి సంపాదించాలంటే ఈజీ. ఇదే ఫార్ములా అప్లై చేసింది ఆ కిలాడీ లేడి. ఏకంగా బడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుంది. షెల్ కంపెనీలు పెట్టింది.. ఫేక్ వర్క్ ఆర్డర్లు చూపించి వందల కోట్లు కొట్టేసింది. కానీ చివరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కిలాడీ లేడీ బాగోతాన్ని బయట పెట్టారు. ఇంతకీ ఆ లేడీ ఎవరు? ఏ విధంగా బడా బాబులను బురిడీ కొట్టించింది?

 

 

ఇక్కడ చూడండి.. ఈమెనే ఆ కిలాడీ లేడీ. పేరు సంధ్యారాణి. పెద్దగా చదువు లేదు..కానీ తెలివి తేటలు మాత్రం మెండుగా ఉన్నాయి. ఈమె పెద్ద పెద్ద వ్యాపారస్తుల వద్ద దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నిజానికి చూస్తే ఎవరూ నమ్మరు. కానీ ఇప్పుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈమెను అరెస్ట్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బడా బాబులను మోసం చేసిన కేసులో ఈమెకు ఆమె భర్త శ్రీధర్‌తోపాటు తమ్ముడు ఎమర్తి రామ్‌దాస్ సహకరించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు..

 

సంధ్యారాణి కన్నింగ్ తెలివితేటలకు ఏం తక్కువ లేదు. ఈజీ మనీ కోసం ఏకంగా 40 వరకు షెల్ కంపెనీలు పెట్టింది. లేని కంపెనీలు ఉన్నట్లుగా నమ్మించి.. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయించింది. వాటిని ఆయా కంపెనీల పేరుతో ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించింది. ఆ తర్వాత ఆ డబ్బులను పలు మ్యూల్ ఖాతాలకు మళ్లించింది. ఇందుకోసం దాదాపు 1800 మ్యూల్ ఖాతాలను ఉపయోగించుకుందంటే మామూలు విషయం కాదు. అలా మ్యూల్ ఖాతాల నుంచి చివరకు తన అకౌంట్లకు డబ్బులను మళ్లించుకుంది. ఇలా ఏకంగా రూ. 500 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసిందని పోలీసులు చెబుతున్నారు… ఎంత పకడ్బందీగా చేసినా.. క్రిమినల్స్ ఎక్కడొ ఒక దగ్గర దొరికిపోతుంటారు. సరిగ్గా సంధ్యారాణి విషయంలో కూడా అదే జరిగింది. ఓ ఇండస్ట్రియలిస్ట్ ఫిర్యాదు చేయడంతో సంధ్యారాణి బాగోతం బయటపడింది. ప్రస్తుతం ఆమెను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు…

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബി.ജെ.പിയിലേക്ക് ചേക്കേറിയതിന് പിന്നാലെ എ.എ.പി നേതൃത്വത്തിനെതിരെ ആഞ്ഞടിച്ച് രാഘവ് ഛദ്ദ

ന്യൂദൽഹി: ആം ആദ്മി പാർട്ടിവിട്ടതിന് പിന്നാലെ അരവിന്ദ് കെജ്‌രിവാളിനെതിരെ വിമർശനവുമായി രാഘവ്...

`ஹர்பஜன் சிங், சுவாதி மாலிவால் உள்ளிட்டோரும்…' – பாஜகவில் இணைந்த ராகவ் சதா தகவல்!

ஆம் ஆத்மி கட்சியின் முக்கியத் தலைவர்களில் ஒருவரான ராகவ் சதா மற்றும்...

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ భారీ స్థాయిలో...

ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಕಟ್ಟಾಳು, ಸಿಎಂ ಆಗಬೇಕು- MLC ಹೆಚ್.ವಿಶ್ವನಾಥ್

ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,25,2026 (www.justkannada.in): ಉಪಚುನಾವಣೆ ಮುಗಿದ ಬೆನ್ನಲ್ಲೆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸಿಎಂ ಬದಲಾವಣೆ...