14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

Jangaon: వివాహిత అదృశ్యం.. ఆ కారణంతో తాను చనిపోతున్నట్లు లెటర్

Date:

జనగామ జిల్లాలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. తాను చనిపోతున్నట్లు లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన శృతి(22) అనే వివాహిత భర్త వేధింపులతో తాళలేక పోయింది. మానసిక వేదనకు గురైన శృతి దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలోని తన తల్లి గారి ఇంటికి ఈ నెల 3న వచ్చింది. ఈ నెల 6 న తెల్లవారుజామున 3 గంటలకు తన 20 నెలల పాపను ఇంట్లో వదిలి శృతి వెళ్ళిపోయింది. భర్త వేధింపులతో తాను చనిపోతున్నట్లు ఓ లెటర్ రాసి వెళ్లింది.

Also Read:Post Office RD Scheme: జస్ట్ రూ. 5000 పొదుపు చేస్తె చాలు.. లక్షాధికారి అయ్యే ఛాన్స్!

కుటుంబ సభ్యులు నిద్ర లేచి చూసే సరికి శృతి ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే చుట్టు పక్కల ప్రాంతాల్లో బంధువుల ఇళ్లలో వెతకడం ప్రారంభించారు. శృతి తల్లిదండ్రులు రెండురోజులుగా వెతుకుతున్నారు. ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. తల్లీ పాల కోసం అలమటిస్తున్న 20 నెలల పసి పాప జాహ్నవి. ఈ క్రమంలో వివాహిత తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮಾ.28ಕ್ಕೆ ಒಳಮೀಸಲಾತಿ ಬಗ್ಗೆ ಸಭೆ: ಅಂದು ಸಮಸ್ಯೆ ಬಗೆಹರಿಯುತ್ತೆ- ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in): ಮಾರ್ಚ್ 28ಕ್ಕೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಒಳಮೀಸಲಾತಿ ಬಗ್ಗೆ...

ഹോട്ടലുകള്‍ കല്‍ക്കരിയിലേക്കും വീടുകള്‍ക്ക് പി.എന്‍ജിയിലേക്കും മാറണം; എല്‍.പി.ജി ക്ഷാമം പരിഹരിക്കാന്‍ സര്‍ക്കാരിന്റെ പുതിയ നിര്‍ദേശം

ന്യൂദല്‍ഹി: ഇറാനെതിരായ ഇസ്രഈല്‍-അമേരിക്ക യുദ്ധത്തിന്റെ അനന്തരഫലമായി ഇന്ധന ക്ഷാമം രൂക്ഷമാവുന്ന സാഹചര്യത്തില്‍...

Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

Mahmudullah: 2016 టీ20 వరల్డ్‌కప్‌ లో భారత్‌ తో జరిగిన మ్యాచ్‌...