4
May, 2026

A News 365Times Venture

4
Monday
May, 2026

A News 365Times Venture

Terrorists: సైనికుల దుస్తుల్లో టెర్రరిస్టులు.. భయపడుతున్న కాశ్మీరీలు..

Date:

Terrorists: పహల్గామ్ ఉగ్రవాద దాడితో వణికిపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను మరో సమస్య వెంటాడుతుంది. టెర్రరిస్టులు సైనికుల దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతుంది.. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు స్థానిక ప్రజలు. అటు భద్రతా సిబ్బందికి ఉన్న ముప్పును పసిగట్టడంలోనూ ఇబ్బందులు వస్తున్నాయి. పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.

Read Also: Pakistan: లష్కరే ఉగ్రవాది, హఫీస్ సయీద్ సన్నిహితుడికి తీవ్రగాయాలు.. గుర్తు తెలియని వ్యక్తుల పనేనా..?

అయితే, ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టులు పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు కాల్పులు జరిపిన దుండగులు కూడా భారత సైనిక దుస్తుల్లో వచ్చారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు విచారణ చేపట్టాయి. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు అదే పంథా కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది తేల్చింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో టెర్రరిస్టులు సైనికుల దుస్తుల్లో కనిపించినట్లు తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అనుమానస్పందగా కనిపిస్తే.. తమకు సమాచారం అందించాలని ఇండియన్ ఆర్మీ పేర్కొనింది.

Read Also: Rahul Gandhi: పాకిస్తాన్‌లో “రాహుల్ గాంధీ” ట్రెండింగ్.. కారణాలు ఏంటి..?

మరోవైపు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్‌ కోరారు. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్‌ విజయవంతంగా చేపట్టిన ‘‘ఆపరేషన్‌ సింధూర్‌’’తో పాక్ కు తగిన బుద్ధి చెప్పాం అన్నారు. అమెరికా తరహాలోనే పాకిస్తాన్‌ కూడా టెర్రరిస్టులను భారత్ కు అప్పగించాలన్నారు. భారత్‌ పాక్‌కు నీటిని అందిస్తే.. వారు మా దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని మండిపడ్డారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യമന്ത്രി ഫേസ്ബുക്ക് ബയോ തിരുത്തിയത് ഇന്നല്ല, വോട്ടെണ്ണല്‍ കാരണവുമല്ല; പി.ബി അംഗമെന്ന് മാറ്റിയത് മാര്‍ച്ച് 16ന്

തിരുവനന്തപുരം: വോട്ടെണ്ണലിന് തൊട്ടുമുമ്പ് മുഖ്യമന്ത്രി പിണറായി വിജയന്‍ തന്റെ ഫേസ്ബുക്ക് ബയോ തിരുത്തിയെന്ന...

"சாவர்க்கர் ஆங்கிலேய அரசுக்கு கருணை மனுக்களை எழுதியது உண்மை; ஆனால்…" – சாவர்க்கரின் கொள்ளு பேரன்

லண்டனில் கடந்த 2023-ஆம் ஆண்டு ஆற்றிய உரையில், சாவர்க்கர் குறித்து அவதூறாகப்...

KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వరుస విజయాలతో దూసుకుపోతోంది....

‘അവര്‍ ഇനിയും മതിയായ വില നല്‍കിയിട്ടില്ല’; ഇറാന്റെ പുതിയ സമാധാന കരാറും തള്ളി ഡൊണാള്‍ഡ് ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ടെഹ്റാന്‍ മുന്നോട്ടുവെച്ച പുതിയ സമാധാന കരാറും അംഗീകരിക്കാന്‍ സാധ്യതയില്ലെന്ന സൂചനയുമായി...