12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. విచారణలో స్పీడ్‌ పెంచిన పోలీసులు..

Date:

APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదైన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. ఈ అక్రమాల్లో మరింత మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్సార్, ఏ2గా క్యామ్ సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో ఏపీపీఎస్సీ కమిషన్ వింగ్ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్రను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ చెప్పిన పనులను వెంకట సుబ్బయ్య చక్కబెట్టినట్టు గుర్తించారు. ప్రస్తుతం వెంకట సుబ్బయ్య అందుబాటులో లేరు. కేసు నమోదు చేయాలని ఫిర్యాదు వచ్చిన గత నెల 22నే వెంకట సుబ్బయ్య అమెరికా వెళ్లారు ఈ నెల 22 వరకు సెలవులో ఉన్నారు.. దీంతో వెంకట సుబ్బయ్య వచ్చాక నోటీసులు ఇవ్వటం లేక అరెస్టు చేస్తారని సమాచారం.

Read Also: Off The Record: ఈటల రాజేందర్ పూర్తిగా మారిపోయారా..?

మరోవైపు కేసులో మూల్యాంకనం చేసిన సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అర్హత లేకపోయినా మూల్యాంకనం చేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారని సమాచారం.. ఇప్పటికే కొందరిని విచారణ కూడా చేశారు. ఇందులో సతీశ్ అనే ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ సూసైడ్ ప్రయత్నం చేసుకోవటం కూడా కలకలం రేపింది. మరోవైపు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ పాత్ర తేల్చాలని బయో డైవర్శిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ డిమాండ్ చేయటం చర్చగా మారింది. అక్రమాల వ్యవహారంలో గౌతం సవాంగ్ పాత్ర ఉందని ఆయన ఆరోపించటం ఇప్పుడు చర్చగా మారింది. ఇప్పటి వరకు కేసు విచారణ పురోగతిని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుతో విచారణ అధికారిగా ఉన్న నందిగామ డీఎస్పీ తిలక్ నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Suryakumar Yadav: డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన సూర్య.. గంభీర్ స్పీచ్‌తో ప్లేయర్లలో పూనకాలు!

Suryakumar Yadav: భారత్ ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడు సార్లు...

LPG ಸಿಲಿಂಡರ್ ಕೊರತೆ: ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿ, ವಾಕ್ಸಮರ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in): ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಸೇರಿ ದೇಶದ...

പ്രധാനമന്ത്രിയെ വിമര്‍ശിക്കുന്ന സോഷ്യല്‍ മീഡിയ പോസ്റ്റുകള്‍ക്ക് പൂട്ട്; ഉത്തരവിട്ട് കേന്ദ്രം

ന്യൂദല്‍ഹി: പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയെയോ സര്‍ക്കാരിനെയോ വിമര്‍ശിക്കുന്നതോ പരിഹസിക്കുന്നതോ ആയ സോഷ്യല്‍ മീഡിയ...