21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

India Pakistan Tension: భారత్ “బ్రహ్మోస్‌‌”తో భీకర దాడి.. పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్.?

Date:

India Pakistan Tension: ఆపరేషన్ సిందూర్ దాటికి పాకిస్తాన్ నిలవలేకపోయింది. ఇన్నాళ్లు మేము గొప్ప మిలిటరీ శక్తిగా భావిస్తూ వచ్చిన పాకిస్తాన్‌కి, భారత్‌ దాడులు దాని స్థాయి ఎంటో నిరూపించింది. పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలపై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్ లోని ఎయిర్‌బేస్‌లను భారత్ లక్ష్యంగా చేసుకుని భీకర దాడి చేసింది. అయితే, ఇప్పుడు ఓ సమాచారం పాకిస్తాన్‌లో వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అణు స్థావరాలపై భారత్ బ్రహ్మోస్‌తో దాడులు చేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మోస్ ధాటికి పాక్ అణ్వాయుధాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లు సమాచారం. దీని కారణంగా, పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుని భారత్‌ని కాల్పుల విరమణకు ఒప్పించాలని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది.

శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలోని నూర్ కాన్ ఎయిర్ బేస్‌పై భారత్ బ్రహ్మోస్ తో దాడి చేసినట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాటలు కూడా భారత్, పాకిస్తాన్‌పై బ్రహ్మోస్‌తో దాడి చేసినట్లు వెల్లడిస్తోంది. నూర్‌కాన్ బేస్ వద్ద అండర్‌గ్రౌండ్‌లో అణ్వాయుధాలను పాకిస్తాన్ దాచినట్లు తెలుస్తోంది. నూర్‌కాన్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్‌లపై భారత్ దాడితో బంకర్లు బద్ధలవడంతో అణ్వాయుధాలు దెబ్బతిని, వాటి నుంచి రేడియేషన్ లీక్ అయినట్లు తెలుస్తోంది. దీనిని పరిశీలించేందుకు అమెరికా న్యూక్లియర్ అడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ చేరుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: Pithapuram Crime: పిఠాపురంలో చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అంతా అమ్మమ్మే చేసింది!

మే 10 తేదీ శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ లోని మొత్తం 11 ఎయిర్ బేస్‌లని భారత్ కేవలం 90 నిమిషాల్లోనే నాశనం చేసింది. ఈ దాడుల్లో బ్రహ్మోస్ వాడినట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్ బేసుల్లో సర్గోదా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సర్గోదాకు సమీపంలోని కార్ని పర్వతాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెడుతుంది. ఈ పర్వతాల్లోనే అనేక సొరంగాల్లో పాక్ వీటిని భద్రపరుస్తుంది. అయితే, దీనిపై భారత్ దాడి చేసింది. ఈ దాడుల్లో కార్ని పర్వతాల్లోని గేట్ల వద్ద భారత్ దాడి చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో, శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. 4.0 తీవ్రతతో భూప్రంకపనలు రావడం కూడా ఇందుకు అనుమానాలు రేకెత్తిస్తోంది. భారత్ దాడికి ఏదైనా అణ్వాయుధం భూగర్భంలో పేలిందా..? అనే ప్రశ్నలు వెలువడుతున్నా్యి. అణ్వాయుధాలతో భారత్ ‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్న పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పడానికి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"தமிழ்நாடு, சர்க்கஸ் கும்பலிடம் மாட்டிக்கொண்டிருக்கிறது.!"- உதயநிதி ஸ்டாலின்

சென்னையில் நடைபெற்ற திருமண நிகழ்ச்சியில் எதிர்க்கட்சி தலைவர் உதயநிதி ஸ்டாலின் கலந்துகொண்டிருக்கிறார்....

No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వ్యాపారులు కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు దిగారు....

ഹിന്ദു സംസ്‌കാരത്തെ അപമാനിക്കുന്നതും പാരമ്പര്യത്തെ തകര്‍ക്കുന്നതും; ഹിന്ദു വര്‍ഗീയതയ്‌ക്കെതിരായ ഹാമിദ് അന്‍സാരിയുടെ പരാമര്‍ശത്തിനെതിരെ യോഗി

ന്യൂഡല്‍ഹി: മുന്‍ ഉപരാഷ്ട്രപതി ഹമീദ് അന്‍സാരിയുടെ ‘ഹിന്ദു വര്‍ഗീയത’യുമായി ബന്ധപ്പെട്ട പരാമര്‍ശങ്ങള്‍ക്കെതിരെ...

`இன்னும் பழைய அரசாங்கத்தையே குறைச் சொல்லிக்கொண்டிருப்பதில் நியாயமில்லை' – விஜய்யை சாடிய எல்.முருகன்

மத்திய இணை அமைச்சர் எல்.முருகன், வேலூரில் செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது அவர்...