26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

UNSC: పహల్గామ్ దాడి వెనుక లష్కరే.. పాకిస్తాన్ ను గట్టిగా మందలించిన యూఎన్ భ‌ద్రతా మండ‌లి

Date:

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళన చెందిన పాకిస్తాన్ UNSC తో సమావేశం కావాలని అభ్యర్థించింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఒంటరి అయింది. ఈ సమావేశాన్ని పాకిస్తాన్ మరోసారి భారతదేశానికి వ్యతిరేకంగా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి ఉపయోగించుకుంది. సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు పాకిస్తాన్‌ పై ప్రశ్నల వర్షం కురిపించారు. పాకిస్తాన్ ‘ఫాల్స్ ఫ్లాగ్’ కథనాన్ని అంగీకరించడానికి ఐక్యరాజ్యసమితి నిరాకరించింది.

Also Read:Viral : “ఇదేం టేస్ట్ రా బాబు” అనిపించేలా ఉంది కదా ఈ ఐస్‌క్రీమ్ ఫ్రైస్ కాంబో..!

పహల్గామ్ దాడిలో లష్కరే తోయిబా ప్రమేయం గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాకిస్తాన్‌ను ప్రశ్నించింది. ఈ సమావేశం ఉగ్రవాద దాడిని విస్తృతంగా ఖండించింది. జవాబుదారీతనం అవసరాన్ని గుర్తించింది. ముఖ్యంగా మత విశ్వాసం ఆధారంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకునే అంశాన్ని కూడా కొందరు సభ్యులు లేవనెత్తారు. ఈ సమావేశంలో, ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయి.పాకిస్తాన్ క్షిపణి పరీక్షపై కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిని రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించాయి.

Also Read:Release Clash : ధనుష్ తో అమీర్ ఖాన్.. రిలీజ్ క్లాష్.. గెలుపెవరిదో.?

ప్రస్తుత పరిస్థితిని అంతర్జాతీయీకరించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది మాత్రమే కాదు, సభ్య దేశాలు పాకిస్తాన్‌కు భారతదేశంతో ఉన్న సమస్యలను ద్వైపాక్షిక స్థాయిలో పరిష్కరించుకోవాలని కూడా సూచించాయి. సమావేశం సమయంలో, తరువాత పాకిస్తాన్ పూర్తిగా ఒంటరైపోయింది. UNSCలోని క్లోజ్డ్ డోర్ గదిలో జరిగిన గంటన్నర సమావేశం ఎటువంటి ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సమావేశం తరువాత, ఐక్యరాజ్యసమితి ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఇటీవలి కాలంలో అత్యంత దారుణమైన స్థాయికి చేరుకుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇచ్చిన హెచ్చరిక తర్వాత ఈ సమావేశం జరిగింది.

Also Read:Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు

పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు, అణ్వాయుధ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయని చాలా మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని అంతర్జాతీయీకరించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. భారతదేశంతో ద్వైపాక్షికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్‌కు సూచించారు. ఫాల్స్ ఫ్లాగ్ అంటే మీరే ఉద్దేశపూర్వకంగా ఒక సంఘటనను సృష్టించి, ఆ తర్వాత దానిని మరొకరిపై రుద్దడం. ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో ముఖ్యంగా ఫాల్స్ ఫ్లాగ్లను ఉపయోగిస్తారు. దీని అర్థం ఒక ఉగ్రవాద సంఘటనను మీరే చేసి, ఆ తర్వాత దానిని మరొకరిపై రుద్దడం. ఈ సమావేశం అసంపూర్తిగా మిగిలిపోయింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..

Iran War: యుద్ధం ముగించేందుకు అమెరికా పెట్టిన 15 షరతుల్ని ఇరాన్...

ನಮ್ಮಲ್ಲಿ ಯಾರೇ ಸಿಎಂ ಆದ್ರೂ ಖುಷಿ ಪಡ್ತೇನೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,25,2026 (www.justkannada.in):  ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಬಜೆಟ್ ಮೇಲಿನ ಚರ್ಚೆಗೆ ಉತ್ತರ ನೀಡುವ...

പ്രതിഭയ്‌ക്കെതിരായ സ്ത്രീവിരുദ്ധ പരാമര്‍ശം; ഇര്‍ഷാദിനെതിരെ നടപടിയുമായി ലീഗും യു.ഡി.എഫും

  കായംകുളം: യു. പ്രതിഭ എം.എല്‍.എയ്‌ക്കെതിരായ സ്ത്രീവിരുദ്ധ പരാമര്‍ശത്തില്‍ മുസ്‌ലിം ലീഗ്...

அழுத்தம் கொடுக்கும் வானதி சீனிவாசன்; அப்செட் அண்ணாமலை; கோவை வடக்கு தொகுதிக்கு உச்சகட்ட போட்டி

2021 சட்டமன்றத் தேர்தலில் அதிமுக கூட்டணியில், பாஜகவுக்கு கோவையில் ஒரு தொகுதி...